Thursday 25 June 2015

మది దోచే మ ష్రూ మ్స్‌

Posted On Sat 20 Jun 23:03:58.705323 2015
చెట్టినాడ్‌ మష్రూమ్‌ కర్రీ

కావలసిన పదార్థాలు
మష్రూమ్స్‌ ముక్కలు-2 కప్పులు, చింతపండు-నిమ్మకాయంత ( అర కప్పు నీళ్లలో నానబెట్టాలి), ఉప్పు-సరిపడా, గరం మసాలా-టీ స్పూను, సెనగపప్పు-టేబుల్‌ స్పూను, మిరియాల పొడి-టీ స్పూను, నూనె-2 టీ స్పూన్లు, ఆవాలు-అర టీ స్పూను, ఎండు మిర్చి-2, కరివేపాకు-2 రెమ్మలు.
తయారు చేయు విధానం
చింతపండుని మెత్తగా గుజ్జులా చేయాలి, సెనగపప్పుని విడిగా చిన్న బాణలిలో వేసి వేయించి పొడి చేయాలి. ఈ పొడిలోనే గరం మసాలా, మిరియాల పొడి కలపాలి. స్టవ్‌ మీద నాన్‌ స్టిక్‌ పాన్‌ పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు వేసి వేయించాలి. కరివేపాకు, ఎండు మిర్చి కూడా వేసి వేగాక పుట్టగొడుగుల ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి. ఉడికాక మూత తీసి చింతపండు గుజ్జు వేసి పది నిమిషాలు సిమ్‌లో ఉడికించాలి. చివరగా గరం మసాలా మిశ్రమం వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి ఉప్పు సరి చూసి దించాలి.

No comments:

Post a Comment