Thursday 25 June 2015

Mashrum

మది దోచే మ ష్రూ మ్స్‌

Posted On Sat 20 Jun 23:03:58.705323 2015


ఆంధ్రా మష్రూమ్‌ కర్రీ

కావలసిన పదార్థాలు
పుట్ట గొడుగులు- పావు కిలో, ఉల్లిపాయలు- మూడు, పచ్చిమిర్చి-మూడు, కారం-టీ స్పూను, పసుపు-పావు టీ స్పూను, కొత్తిమీర-కట్ట, నూనె-వేయించడానికి సరిపడా, ఉప్పు- తగినంత.
మసాలా ముద్ద కోసం
అల్లం తురుము- టీ స్పూను, వెల్లుల్లి-రెండు రెబ్బలు, జీలకర్ర- టీ స్పూను, గసగసాలు-టీ స్పూను, ధనితయాలు-టీ స్పూను
తయారు చేయు విధానం
పుట్టగొడుగుల్ని కడిగి ముక్కలుగా కోయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరగాలి. మసాలా ముద్ద కోసం తీసుకున్న దినుసులన్నీ ముద్దలా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేసి ఉల్లిముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరువాత ఉప్పు వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు కప్పు నీళ్లు పోసి మీడియం మంట మీద రెండు నిమిషాలు ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికిన తరువాత మసాలా ముద్ద వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి దించి కొత్తిమీర చల్లితే సరి.

No comments:

Post a Comment