Wednesday 13 May 2015

Get the beauty with milk


పాలతో అందానికి మెరుగులు

  • -
పాలను ఓ సౌందర్య సాధనంగా వాడడం ఈనాటి అలవాటు కాదు. రాజులు, మహారాణులు పాలతో స్నానాలు చేసేవారని చరిత్ర చెబుతూనే ఉంది. ఈనాటికీ కొన్ని ప్రాంతాల్లో వివాహానికి ముందు రోజు పెళ్లికూతురికి పాలతో స్నానం చేయించే ఆచారం ఉంది. సౌందర్య పోషణకు సంబంధించి నేటితరం వారికీ పాలపైన ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ఎన్నో వ్యాపార సంస్థలు పాలను ప్రాతిపదికగానే చేసుకుని మాయిశ్చరైజర్లు, క్రీమ్‌లు, సన్‌స్క్రీన్ లోషన్, బ్లీచ్ వంటి పలు సౌందర్య సాధనాలను తయారుచేస్తున్నాయి.
క్లెన్సర్‌గా..
పాలను ఉత్తమమైన క్లెన్సర్‌గా చెప్పుకోవచ్చు. పాలలోని లాక్టిక్ యాసిడ్‌లో ఉండే అల్ఫా హైడ్రాజెల్ అనే పదార్థానికి చర్మాన్ని శుభ్రం చేసే గుణం ఉంది. చర్మం టోనింగ్‌ను (నల్లబడటాన్ని) తక్కువగా చేస్తుంది. చర్మ రంధ్రాలు పెద్దవైతే విరిగిన పాలు కలిపిన లేపనం వాడాలి. పాలలో కొద్దిగా నిమ్మరసం పిండితే అవి విరుగుతాయి. అందులో దూదిని ముంచి రాత్రి పూట పడుకునే ముందు ముఖానికీ, మెడకూ రాసుకుని టిష్యూ పేపరుతో అదనపు పాలను తుడిచివేయాలి. జిడ్డు చర్మంగలవారు, పాలతో దూదిని ముంచి ముఖానికీ, మెడుకు రాసుకుని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. శుష్క చర్మం వున్నవారు మీగడపాలు వాడాలి.
మాయిశ్చరైజర్‌గా ..
పాలను మించిన మంచి మాయిశ్చరైజర్ ఇంకొకటి లేదు. ఎండిపోయినట్లుగా, గురుకుగా ఉండే చర్మానికి తేమ కలిగిస్తుంది. ఒక కప్పు పాలతో మూడు స్ట్రాబెర్రీలను రుబ్బి పేస్ట్‌లా చేయాలి. ఒక చిన్న చెంచాడు గ్లిజరిన్‌ను దీనికి చేర్చి శుభ్రమైన సీసాలో పోసి రిఫ్రిజిరేట్‌లో నిలువ వుంచి నిత్యం రాసుకుంటూ ఉండాలి. అయితే, ఈ లోషన్‌ను రాసుకునేముందు సీసాను కుదపటం మరువకూడదు.
బ్లీచ్‌గా..
చర్మపు రంగును తేర్చటంలో పాలు చక్కని బ్లీచ్‌గా ఉపయోగపడతాయి. ఒక కప్పు పాలు, ఒక చెంచాడు కమలాపండు రసం, ఒక చిన్న చెంచాడు తేనె కలిపి మిశ్రమంలా చేసి దానితో తరచూ ముఖం కడుక్కోవాలి.
సన్‌స్క్రీన్ లోషన్‌గా..
చల్లటి మజ్జిగను ముఖానికీ, చేతులకూ, కాళ్ళకూ బాగా రాస్తే ఎండలోంచి వచ్చిన తరువాత మంచి ఔషధంలా పనిచేస్తుంది.
యవ్వనవంతులుగా...
పాలలో ఉండే ప్రొటీనులు, కొవ్వు వయసును ఎక్కువగా కనిపించకుండా చేస్తాయి. ముఖంపైన ఉండే ముడతలను కనిపించకుండా చేస్తాయి.
ఫేషియల్ స్క్రబ్‌గా..
జిడ్డు చర్మంగలవారు ఒక చెంచాడు స్కిమ్‌డ్ పాలలో ఒక చిన్న చెంచాడు తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మర్దన చేసుకోవాలి. శుష్కర్మం గలవారు మీగడపాలు వాడాలి. చర్మం బిగువుగా రావాలంటే పాలు కాచిన తరువాత పాత్ర అడుగున అంటుకుపోయిన మీగడను తీయాలి. దీనికి పన్నీరు, కాస్త తేనె కలిపి ముఖానికీ, మెడకూ రాసుకుని పావు గంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇది చర్మానికి బిగువును కలిగించేలా పనిచేస్తుంది.
మాస్క్‌గా...
చెంచాడు పాలలో, పావు చెంచాడు బాదం నూనె కలపాలి. మామూలుగా ముఖం కడుక్కున్న తరువాత ఈ మిశ్రమాన్ని ఒక పూత పూయాలి. అది ఎండిపోయిన తరువాత మరో పూత పూయాలి. బాగా ఎండిపోయి బిగువుగా అయిన తరువాత గోరువెచ్చని నీటితో మాస్క్‌ను తీసేయాలి.
స్నానానికి..
ఒక బకెట్ నీటిలో రెండు చుక్కలు లావెండర్ నూనె, ఒక పెద్ద చెంచా తేనె, రెండు చెంచాల పాలపొడి కలపాలి. తరువాత ఈ నీటితో స్నానం చేయాలి. కొద్దిసేపు ఆగి మామూలు నీటితో తిరిగి స్నానం చేయాలి. ఈ పద్ధతి కాకుండా మరో పద్ధతిని కూడా పాటించవచ్చు. ఒక చిన్న గినె్నలో కొద్దిగా తేనె తీసుకుని, దానికి పాల పొడి చేర్చి పలుచని మిశ్రమంలా తయారుచేసి శరీరమంతటిపైనా కొద్ది కొద్దిగా జల్లులా చల్లుకుంటూ రాసుకుని, తరువాత మామూలు నీటితో స్నానం చేయాలి.
హెయిర్ ప్యాక్‌గా..
పావు కప్పు పాల పొడిని నీటిలో కలిపి ముద్దలా చేసి జుట్టుకు రాసుకుని మర్దనా చేసుకోవాలి. వేడి నీటిలో ముంచిన టవల్‌ను తలకు చుట్టుకుని అరగంట సేపు ఉంచుకోవాలి. టవల్ ఆరిపోతే మళ్లీ నీటిలో ముంచి చుట్టుకోవాలి. ఒక కప్పులో పాలు తీసుకుని కొద్దిగా బాదంనూనె కలిపి, అందులో దూదిని ముంచి ముఖానికీ, మెడకూ రాసుకుని మేకప్‌ను తీసివేయవచ్చు. పాలు చక్కని మేకప్ రిమూవర్‌గానూ పనిచేస్తాయి

Tuesday 12 May 2015

Zunk food create - great problems - be careful


ఫుడ్డు అదిరె.. పొట్టకు బెదురే..

సరదాగా బయట తిందాం అనుకుంటున్నారా? కాస్త జాగ్రత్త.. బయటి నీళ్ళను నేరుగా తాగినపుడు వాటిలోని అనేక సూక్ష్మజీవులతో ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. అందులోని బ్యాక్టీరియా, ఏక కణజీవులు, వైరస్ కారక క్రిములు, నులిపురుగుల వంటి జీవులవల్ల కడుపు దెబ్బతినే అవకాశాలున్నాయి. ఇటీవల కొన్ని దేశాల ఆహార పదార్థాల వల్ల ‘ఈ-కోలై’ పరాన్నజీవులు వ్యాపిస్తున్నాయనే కారణంతో మరికొన్ని దేశాల ఆహార దిగుమతులను నిషేధించడంతో ఇది ఒక అంతర్జాతీయ సమస్యగా మారడం కూడా తెలిసిందే. మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కేవలం ఆహారం కలుషితం కావడంవల్ల ఏటా 22 లక్షల మంది మృతి చెందుతున్నారంటే ఈ సమస్య తీవ్రత ఏమిటో అర్థమవుతుంది. ఇందులో కనీసం 18 లక్షల మంది ఐదేళ్ళలోపు చిన్నారులే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెరుగుతున్న పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, ఒకసారి జనాభా పెరగడంతో వ్యర్థాల నిర్మూలన సమర్థంగా జరగకపోవటం వంటివి దీనికి కారణాలు.
వ్యాధులెన్నో...
ఆహారం కలుషితం కావడంవల్ల వచ్చే జబ్బులు వ్యాధి కారకాన్ని బట్టి చాలా రకాలుగా ఉంటాయి.
బ్యాక్టీరియావల్ల... సాల్మోనెల్లాటైఫీ అనే రకం బ్యాక్టీరియమ్‌తో టైఫాయిడ్, క్లాస్ట్రేడియమ్ అనే బ్యాక్టీరియమ్‌వల్ల ఫుడ్ పాయిజనింగ్‌తోపాటు బోట్యులిజం అనే ప్రమాదకరమైన వ్యాధి, విబ్రియో అనే బ్యాక్టీరియమ్‌తో నీళ్ళ విరేచనాలు, జ్వరం; షిజెల్లా అనే బ్యాక్టీరియమ్‌వల్ల షిజెల్లోసిస్ అనే ఒకరకం ఇన్‌ఫెక్షన్ వస్తాయి.
ఏక కణజీవులవల్ల...
జియార్డియా అనే ఏకకణ జీవులవల్ల జియార్డియా, ఎంటమిబా హిస్టలిటికా అనే తరహా ఏకకణజీవులతో అమీబియాసిస్, క్రిప్టోస్పోరిడియమ్, మైక్రోస్పోరిడియమ్ అనే క్రిములవల్ల క్రిప్టోస్పోరిడియాసిస్, మైక్రోస్పోరిడియాసిస్ వంటి వ్యాధులు సోకుతాయి.
నులిపురుగులు.. నులిపురుగుల్లో అనేక రకాలైన రౌండ్ వార్మ్, థ్రెడ్‌వార్మ్, హుక్‌వార్మ్ వంటివి పేగులో ఉండి ఆహారాన్ని శరీరానికి అందకుండా చేస్తాయి.
ఇక రకరకాల వైరస్‌లవల్ల హెపటైటిస్-ఎ, హెపటైటిస్-ఈ వంటి కామెర్లు తరహా వ్యాధులు చాలా సాధారణంగా కనిపిస్తాయి. రొటావైరస్‌వల్ల పిల్లలలో నీళ్ళ విరేచనాలు మామూలే.
చికిత్స... ఆహారం కలుషితం కావడంవల్ల వచ్చే సమస్యలు చాలామట్టుకు నివారించదగినవే. పిల్లలు, వృద్ధుల్లో ఆహార కాలుష్యం వల్ల డీహైడ్రేషన్ రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో శరీరానికి అవసరమైన ద్రవాలను సమకూర్చడం తప్పనిసరి. అందుకే శరీరానికి అవసరమైన ద్రవాలు అందేలా నీళ్ళు, ద్రవాహారం ఎక్కువగా ఇవ్వాలి. విరేచనాలతోపాటు కడుపునొప్పి, జ్వరం ఉంటే డాక్టర్ల పర్యవేక్షణలో యాంటిబయాటిక్స్ వాడాలి. అయితే ఆహారం కలుషితం కావడంవల్ల వచ్చే సమస్యల్లో చాలామట్టుకు వాటంతట అవే తగ్గిపోతాయి. ప్రమాదానికి దారితీసే సందర్భాలు చాలా తక్కువే. అయినా అదేపనిగా విరేచనాలు, వాంతులు, జ్వరం ఉంటే డాక్టర్‌ను కలిసి అవసరమైన పరీక్షలు చేయించాలి.
లక్షణాలు.. కారణం ఏదైనప్పటికీ సాధారణంగా ఆహారం కలుషితం కావడంవల్ల కనిపించే లక్షణాలు ఇవి.
నీళ్ళ విరేచనాలు వాంతులు పొట్టనొప్పి
కడుపులో గ్యాస్ కడుపులో ఇబ్బందిగా ఉండటం
కొన్నిసార్లు జ్వరం రావడం
నీరసం
బరువు తగ్గడం
ఈ లక్షణాలు దీర్ఘకాలికంగా ఉండడంవల్ల క్రమంగా శరీరంలో ద్రవాలు తగ్గడం, శరీరానికి అవసరమైన పోషకాలు సరిగ్గా అందకపోవడం జరగవచ్చు. వైరస్ ఇన్‌ఫెక్షన్స్‌వల్ల ముందుగా పై లక్షణాలే కనిపించి ఆ తర్వాత కామెర్లు రావచ్చు. కామెర్ల వ్యాధిలో కొన్నిసార్లు అరుదుగా అది కాలేయం పనిచేయకపోవడానికి దారితీయవచ్చు.
పరీక్షలు..
విరేచనాలు, కడుపునొప్పితోపాటు మలవిసర్జన సమయంలో రక్తంపడుతుంటే అవసరాన్ని బట్టి మల పరీక్ష, స్టూల్ కల్చర్ పరీక్ష చేయించాలి. మూత్రపిండాలు, కాలేయం పనితీరును తెలుసుకునే పరీక్షలు చేయించాలి.
నివారణ.. ఆహారం కలుషితం అయ్యే వ్యాధుల్లో చాలామటుకు నీళ్ళవల్లనే రావచ్చు. అందుకే పరిశుభ్రమైన నీళ్ళు తాగాలి. నీళ్ళు కాచి వడపోసి తాగాలి.
పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
ఆహారాన్ని వండేప్పుడు, తినేప్పుడు పరిశుభ్రత పాటించాలి.
స్థానికంగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవచ్చు, కానీ బయటి ఊళ్ళకు వెళ్లినపుడు అక్కడ ఆహారం తీసుకోవడం తప్పనిసరి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మాత్రం వేడిగా ఉన్న పదార్థాలు తినడం శ్రేయస్కరం, వీలైనపుడు మాత్రం పై జాగ్రత్తలు పాటించాలి.
చేయాల్సినవి.. టాయిలెట్‌కు వెళ్లి వచ్చాక చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
తినే ముందు కూడా చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.
పరిసరాలు పూర్తిగా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు తినేయాలి.
ఈగలు రాకుండా కిటికీలకు నెట్ వాడటం మంచిది.
బయటి నీళ్ళు తాగేప్పుడు నేరుగా కుళాయి నీళ్ళు తాగవద్దు. బయట ఐస్‌క్యూబ్స్ వాడొద్దు. చెరుకురసం ఆరోగ్యదాయకం అయినప్పటికీ అందులో వేసే ఐస్ కలుషితమైనది కావచ్చు.
బయటి పదార్థాలు సాధ్యమైనంత వరకు తినకండి.
ఒకవేళ బయటి పదార్థాలు తినాల్సి వచ్చినపుడు అందులో ఉడికించడానికి వీల్లేని సలాడ్స్, కడగకుండా తినే పండ్లు, అపరిశుభ్రంగా ఉండే పళ్ళరసాలు, చట్నీస్ వంటివి సాధ్యమైనంతమట్టుకు తీసుకోకుండా చూసుకోండి.
ఆరుబయట మల విసర్జన ఎప్పుడూ చేయవద్దు.
పాత్రలు కేవలం సబ్బుతో లేదా డిటర్జెంట్‌తో కడగటం మంచిది. వాటిని శుభ్రం చేయడానికి మట్టి వాడొద్దు

Did you find the differences in heart beating?


‘హృదయ స్పందన’లో తేడాలు గమనించారా?


గుండె-్ఛతీ లోపల పిడికిడంతే ఉంటుంది గానీ తల నుంచి కాళ్ళ వరకూ శరీరంలోని అణువణువుకూ రక్తం అందేలా అది నిరంతరాయంగా సంకోచిస్తూ, వ్యాకోచిస్తూ.. నిమిషానికి 60 నుంచి 100సార్లు దాకా బలంగా కొట్టుకుంటుంది. అదే దీని ప్రత్యేకత. అయితే ఈ గుండె కొట్టుకునే వేగంలో తీవ్రమైన తేడాలు వస్తే మాత్రం.. గుండె దడ, ఊపిరాడకపోవడం, స్పృహ తప్పటం వంటి రకరకాల సమస్యలు బాధించే అవకాశం ఉంది. కొన్నిసార్లు హఠాత్తుగా మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది. అందుకే దీని గురించి అవగాహన పెంచుకోవడం చాలా అవసరం!
స్పందించే తీరు
నిజానికి మన గుండె రోజంతా ఎప్పుడూ ఒకే వేగంతో కొట్టుకోదు. నిద్రపోతున్న సమయంలో మన శరీరానికి రక్తం అవసరం తగ్గుతుంది. దీనికి తగ్గట్టుగానే మన గుండె కొట్టుకునే వేగం కూడా నిమిషానికి 50-60 సార్లకు తగ్గిపోతుంది. అదే మనం వేగంగా పరుగెడుతుంటే గుండె నిమిషానికి 110, 120 సార్లవరకూ కూడా కొట్టుకోవచ్చు. ఇలా మనం చేస్తున్న పనిని బట్టి గుండె కొట్టుకునే వేగంలో తేడాలు రావడం మామూలే. అప్పుడప్పుడు ఉన్నట్టుండి పెరిగిపోవటం, వేగంగా కొట్టుకుంటుండడం, లేదా వేగం మరీ తగ్గిపోవటం, ఇవన్నీ సమస్యలే! ఇలా గుండె ‘లయ’ తప్పి ఎక్కువ, తక్కువలుగా అసహజంగా కొట్టుకోవటాన్ని ‘అరిత్మియా’ అంటారు.
లక్షణాలు
గుండె మామూలు కంటే చాలా వేగంగా కొట్టుకుంటుంటే దాన్ని ‘టెకీకార్డియా’ అనీ, మామూలు కంటే తక్కువగా కొట్టుకుంటుంటే దాన్ని ‘బ్రాడీకార్డియో’ అని అంటారు. పూర్తిగా సంకోచించకుండా వణుకుతున్నట్టుగా పైపైనే కొట్టుకోవటాన్ని ఫిబ్రిలేషన్, ప్లట్టర్ అంటారు. గుండె లయ ఇలా అస్తవ్యస్తంగా తయారైతే దాని లక్షణాలు రకరకాలుగా ఉండొచ్చు.
ఛాతిలో ఏదో వేగంగా బలంగా కొట్టుకుంటున్నట్టు దడ అనిపిస్తుంది. ఉన్నట్టుండి కొద్దిసేపు స్పృహ తప్పి పడిపోవచ్చు.
స్పృహ తప్పి పడిపోతే మామూలుగా దాన్ని మూర్ఛ, పక్షవాతం వంటి మెదడుకు సంబంధించిన న్యూరాలజీ సమస్యగా అనుకుంటారు గానీ.. ఇలా ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోతున్నవారిలో 40 శాతంమందికి మెదడు సమస్యలేమి లేవని, గుండె సమస్యలే కారణమని చాలా అధ్యయనాల్లో తేలింది.
కొన్నిసార్లు గుండె కొట్ట్టుకోవటం మరీ అస్తవ్యస్తంగా మారి, హఠాన్మరణం కూడా సంభవించవచ్చు. ఒకసారి గుండెపోటు బారినపడినవారికి ఈ ప్రమాదం మరీ ఎక్కువ. కొంతకాలం పాటు అతివేగంగా కొట్టుకోవటంవల్ల గుండె సైజు పెరిగి దానివల్ల పంపింగ్ సామర్థ్యం తగ్గి.. క్రమంగా ‘హార్ట్ ఫెయిల్యూర్’ రావచ్చు.
ఎన్నో సమస్యలు
గుండెలో విద్యుత్ ప్రేరేపణలను విడుదల చేస్తుంది. ‘ఎన్‌ఏనోడ్’ చాలా వేగంగా లేదా చాలా మెల్లగా స్పందిస్తున్నా, లేక దీనికి పోటీగా గుండెలోని మరో ప్రాంతం కూడా విద్యుత్ ప్రేరణలను ఉత్పత్తి చేయటం మొదలుపెట్టినా లేక గుండెలో ఈ విద్యుత్ ప్రేరణలు ప్రయాణించే మార్గాల్లో ఎక్కడన్నా అంతరాయాలు వచ్చినా.. గుండె కొట్టుకునే తీరు అస్తవ్యస్తమై ‘అరిత్మియా’కు దారితీస్తుంది.
తేడాలెందుకు?
అసలు మన గుండె క్రమబద్ధంగా కొట్టుకుంటూ ఉండటానికి విద్యుత్ ప్రేరేణలే ముఖ్యం. ఈ విద్యుత్ ప్రేరణలను గుండెలోని కుడివైపు పై గది (కర్ణిక మీద సైనో ఏట్రియల్ నోడ్ (ఎస్‌ఎనోడ్) ఆ చిన్న ప్రాంతం పుట్టిస్తుంటుంది. ఈ ప్రాంతం మన గుండెలో ఉండే సహజసిద్ధమైన ‘పేస్‌మేకర్’ లాంటిది. మనం ఏ పని చేస్తున్నాం, దానికి తగ్గట్టుగా రక్తం సరఫరా ఎలా ఉండాలి, గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలో ఇదే ఎప్పటికప్పుడు విశే్లషిస్తూ.. తగ్గట్టుగానే నిరంతరాయంగా కరెంట్ ప్రేరణలను విడుదల చేస్తుంటుంది. ఇక్కడ మొదలైన ప్రేరణలు... ముందు వైపు రెండు గదులకూ ప్రయాణిస్తాయి. వెంటనే అవి ఒక్కసారిగా సంకోచిస్తాయి. ఇంతలో ఈ కరెంట్ ప్రేరణలు గుండెలోని పై గదులకూ, కింది గదులకు మధ్యలో వుండే ‘ఏట్రియా వెంట్రిక్యులర్ నోడ్’ను చేరుతాయి. ఈ నోడ్ ఒక రకంగా మన విద్యుత్ తీగల జంక్షన్ వంటిది. ఇక్కడనుంచి కరంట్ ప్రేరణలు- ప్రత్యేకమైన వైర్ల వంటి కణమార్గాల ద్వారా కింది రెండు గదులనూ చేరతాయి. దీంతో కొద్దిక్షణాల తేడాలోనే కింది గదులు రెండు కూడా బలంగా సంకోచిస్తాయి. రక్తం ఒక్కసారిగా బలంగా పంప్ అవుతుంది ఈ పద్ధతిలో ఉండే గొప్పతనం గుండె మొత్తం ఒక్కసారే సంకోచించకుండా.. కరెంట్ ప్రేరణలను బట్టి ముందుగా పై గదులు, కొద్ది మిల్లీ సెకన్ల తేడాలోనే కింది గదులు సంకోచిస్తుండటం! ఈ చిన్న తేడావల్ల రక్తం పై గదుల నుండి పూర్తిగా కిందికి వచ్చే వీలుంటుంది. ఈ సంకోచ- వ్యాకోచాలు.. ఇదే విధంగా, ఎక్కడా లయ దెబ్బతినకుండా కొనసాగుతుంటేనే.. గుండె రక్తాన్ని సక్రమంగా పంపింగ్ చెయ్యగలుగుతుంటుంది. ఈ విద్యుత్ యంత్రాంగంలో ఎక్కడ తేడా వచ్చినా కూడా పరిస్థితి అస్తవ్యస్తంగా ‘అరిత్మియా’కు దారితీస్తుంది. రక్తసరఫరా కూడా అస్తవ్యస్తమవుతుంది.
వేగంలో మార్పులు
సిక్ సైనస్ సిండ్రోమ్
ఇది ముసలివాళ్ళలో ఎక్కువ. సమయానికి తగ్గట్టుగా విద్యుత్ ప్రేరణలను విడుదల చేయాల్సిన నైనోఏట్రియల్ నోడ్ మందకొడిగా మారుతుంది. దీంతో ముందు గుండె కొట్టుకునే వేగం తగ్గిపోయి, నడక, ఊపిరి కష్టంగా మారటం వంటి సమస్యలన్నీ వస్తాయి. దీనికి ప్రత్యామ్నాయ స్పందనగా, గుండె మొత్తం అక్కడక్కడ కరెంట్ ప్రేరణలు ఉత్పత్తి అవుతూ క్రమేపీ ‘ఏట్రియల్ ఫిబిలేషన్’ వచ్చి గుండె లయ మొత్తం తప్పి, గుండె గదులు ఒక పద్ధతి లేకుండా గందరగోళంగా కొట్టుకుంటూ ఉంటాయి.
హార్ట్ బ్లాక్.. వయసుతోపాటు గుండె కండరంలో కూడా తేడాలు వస్తుంటాయి. కొన్నిసార్లు కాల్షియం ఉరుకుని, మరికొన్నిసార్లు నాడీ మార్గాలు ముందుగా తయారై, గుండె గదుల మధ్య పైనుంచి కిందికి కరెంట్ ప్రేరణల ప్రసారం ఆగిపోతుంది. ఇలా అంతరాయం ఏర్పడితే, ఉన్నట్టుండి కరెంట్ ప్రసారం నిలిచిపోయి, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. దానివల్ల స్పృహ తప్పే అవకాశం కూడా ఉంది.
వ్యాధి నిర్థారణ.. రోగిని క్షుణ్ణంగా పరీక్షించటం చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని ఇతరత్రా సమస్యల్లో కూడా ‘గుండెదడ’ రావచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలవల్ల గుండె వేగం మారిపోతుంది. అలాగే జింకోబిల్చ్ లాంటివి కలిసిన మూలికా ఔషధాలు తీసుకున్నా కూడా గుండె కొట్టుకోటం అస్తవ్య్తమవుతుంది. కొంతమందిలో, మరీ ముఖ్యంగా చిన్న వయసు స్ర్తిలలో కేవలం మానసిక ఆందోళన కూడా లయ తప్పటానికి, గుండె దడ కారణమవుతుంది. కాబట్టి ముందుగా ఇలాంటి సమస్యలేమైనా ఉన్నాయేమో చూడటం అవసరం. ఇవేమీ లేకపోతే.. సమస్య గుండెలోనే ఉందని అనుమానించవచ్చు. గుండెలోని విద్యుత్ ప్రేరణల తీరును తెలిపే ప్రధానమైన పరీక్ష ఈసీజీ. దీన్ని దడగా ఉన్నప్పుడు చేస్తేనే లయలో వస్తున్న తేడాలు తెలుస్తాయి. 24 గంటల పాటు ఈసీజిని రికార్డు చేసే ‘హోల్డర్’ పరీక్ష ఇందుకు ఉపకరిస్తుంది. గుండె పరిమాణం పెరిగేలా చేసే ఏ సమస్య అయినా చివరికి అరిత్మియాలకు దారితీయవచ్చు. కాబట్టి అవసరాన్ని బట్టి ఎకో, త్రెడ్‌మిల్ పరీక్షలు కూడా చేస్తారు. మరీ అవసరమైతే, తొడ దగ్గర లేదా మెడ దగ్గర రక్తనాళాల గుండా సన్నటి తీగలను గుండెలోకి పంపించి వాటి ద్వారా కరెంట్ ప్రేరణలను పంపుతూ... గుండెను ప్రేరేపిస్తారు. లోపం ఏదైనా ఉంటే అప్పుడు బయటపడుతుంది. ఈ పరీక్షల్లో గుండె లయల్లో తేడాలున్నాయా, ఉంటే దానికి మూలం ఎక్కడుందనే విషయం కూడా స్పష్టమవుతుంది.
చికిత్స
గుండె దడకు అసలు మూలం ఏమిటి, బాధితుల వయస్సు, లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంటే చికిత్స ఈ విధంగా ఉంటుంది.
మందులు.. ఎప్పుడన్నా ఒకసారి గుండె లయ తప్పి దడలాంటి లక్షణాలు బాధిస్తున్నప్పుడు మందులు ప్రయత్నించవచ్చు. 60-70 శాతం మందిలో మందులు బాగానే పనిచేస్తాయి. ఈ మందులన్నీ గుండె దడను తగ్గించేందుకు ఇచ్చేవి. తక్కువ డోస్‌తోనే పరిస్థితి దారిలోకి వస్తుంటే సమస్య ఉండదు. కాకపోతే వీటిని జీవితాంతం తీసుకుంటూ ఉండాలి. గర్భిణీలు మాత్రం ఈ మందులు వాడే విషయంలో వైద్య సలహా తీసుకొని ఉపయోగించడం మంచిది. ఈ మందులతో ఎలాంటి ఫలితం లేకపోతే ‘అబ్లేషన్’ వంటి ఇతర పద్ధతులకు వెళ్ళాల్సివస్తుంది.
అబ్లేషన్.. గుండెలో కొన్ని కొన్ని ప్రాంతాల్లోని కణాలు అనవసరంగా విద్యుత్ ప్రేరణలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ మొత్తం గుండె లయనే దెబ్బతీస్తున్నప్పుడు... వాటిని నిర్వీర్యం చేయడానికి ఈ చికిత్స చక్కగా ఉపయోగపడుతుంది. బయట నుంచి రక్తనాళాలద్వారా గుండెలోకి సన్నటి తీగను పంపి.. ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఆ ప్రాంత కణాలను 2-4 మిల్లీమీటర్ల తీగమొనతో బాగా వేడి చేసి (అబ్లేషన్) నిర్వీర్యం చేస్తారు. దీంతో ఆ కొద్ది ప్రాంతం చచ్చుబడి.. అతి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుంది. ఈ చికిత్స 90 శాతం వరకూ సమర్థవంతంగా పనిచేస్తుంది.
పేస్‌మేకర్లు
గుండె కొట్టుకునే వేగం బాగా తగ్గిపోతున్నా, గుండె విఫలమయ్యే పరిస్థితి ఉన్నా, స్పృహ తప్పటం వంటివి వచ్చినా... ‘పేస్ మేకర్ల’ను అమర్చటం వల్ల ఉపయోగం ఉంటుంది. చిన్న సర్జరీ చేసి.. భుజం దగ్గర ఈ పరికరాన్ని అమరుస్తారు. అక్కడినుంచి దీని తీగలను గుండెలోకి పెడతారు. ఇవి ఎప్పటికప్పుడు గుండె కొట్టుకునే వేగాన్ని గమనిస్తూ.. అది తగ్గుతున్నట్టుంటే వెంటనే బయటనుంచి విద్యుత్ ప్రేరేపణలు ఇవ్వడం ద్వారా గుండెను మళ్లీ దారిలోకి తెస్తాయి. ఈ పేస్‌మేకర్లలో చాలా రకాలున్నాయి. అవసరాన్ని బట్టి వేటిని అమర్చాలన్నది వైద్య నిపుణులు నిర్థారిస్తారు.
గుండె కొట్టుకోవడంలో సమస్యలైన ‘అరిత్మియా’లు ఎందుకు వస్తాయన్నది కచ్చితంగా చెప్పడం కష్టం. అయితే మన ఆహారపు అలవాట్లలో కాఫీ, కూల్‌డ్రింక్స్ వంటి కెఫేన్ ఎక్కువగా ఉండే పానీయాలు గుండె విద్యుత్ చర్యల మీద నేరుగా ప్రభావం చూపుతాయని, అలాగే... ఆల్కహాల్ ఎక్కువగా తాగినా కూడా గుండె దడ పెరుగుతుందని, అస్తవ్యస్థమైన జీవనశైలి కూడా కొంతవరకు గుండె లయను తప్పడానికి కారణమని ఈ మధ్య చాలా అధ్యయనాల్లో తేలింది. కాబట్టి కెఫీన్, ఆల్కహాల్ పానీయాలు తగ్గించడం, చక్కని జీవనశైలితోపాటు హైబీపీని అదుపులో ఉంచుకోవడం వంటివి హృదయ స్పందనల్లో తేడాలను అరికట్టి, గుండె సక్రమంగా కొట్టుకునేలా చూసేటటువంటివి.. మంచి రక్షణ చర్య
లు

Eating little is good for health


అర్ధాకలి మంచిదే!

  • -
  • :
*సుష్టుగా తింటే సమస్యలే *పనినిబట్టి ఆహారం
* శ్రమను బట్టి శక్తి అవసరం
రోజంతా కష్టపడి పనిచేసే పెద్దవారికి సమారు 2,400 కేలరీల శక్తినిచ్చే ఆహార పదార్థాలు కావాలి. ఆఫీసులో ఉద్యోగాలు చేసేవాళ్ళకు సుమారు 1800 కేలరీలు సరిపోతాయి.
మన దేశ జనాభాలో 30 శాతం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. గర్భిణీలకు, చిన్నపిల్లలకు, వ్యవసాయ కూలీలకు అవసరమైన పోషకాహారం దొరకడం లేదు. హెల్త్ ఇండిసిస్ ప్రకారం మార్బిడిటీ రేటు మోర్టాలిటీ రేటు శిశు మరణాల సంఖ్య సగటు వయసులో మనం వెనుకబడి ఉన్నాం. ఇతర దేశాల్లో ఆడవాళ్ళ సగటు జీవన వయస్సు ఎక్కువ. మగవాళ్ళకి తక్కువ. మన దగ్గర ఆడవాళ్ళ జీవన ప్రమాణం తక్కువ. మగవాళ్ళ ప్రమాణం ఎక్కువ. వీరిలో చాలామంది సరైన ఆహారం, ప్రసవానంతర జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రతి వ్యక్తి తను చేసే పనిని బట్టి తగినన్ని కేలరీలను ఇచ్చే ఆహారం తీసుకోవాలి. రాళ్ళు కొట్టేవాళ్ళు, బండ పనులు చేసేవాళ్ళు వాస్తవానికి ఇంకా ఎక్కువ కేలరీలు ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. కాని వాళ్ళకు మామూలు ఆహారం కూడా దొరకని స్థితిలో ఉన్నారు. వీళ్ళ తర్వాత మోడరేట్ వర్కర్స్, లైట్ వర్కర్స్ వస్తారు. వీళ్ళకి శారీరక శ్రమ తక్కువ కాబట్టి తక్కువ తిన్నా సరిపోతుంది.
మన దేశంలో మగవాళ్ళకు 1800 కేలరీలు రెండు లేక మూడు పూటలా ఆహారం కావాలి. స్ర్తిలకు రోజుకు 1600 కేలరీలు కావాలి. ఆహారంలో ప్రొటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలతోబాటు నీళ్ళలో కరిగే విటమిన్లు (విటమిన్ బి, సి) కొవ్వులలో కరిగే విటమిన్లు (డి.ఎ.ఇ) తీసుకోవాలి. నీళ్ళలో కరిగే విటమిన్లు ఎక్కువైనా అంత ప్రమాదం లేదు. మూత్రం ద్వారా వెళ్లిపోతాయి. క్రొవ్వులలో కరిగే విటమిన్లు ఎక్కువ తీసుకోవటం మంచిది కాదు. నీళ్లశ్ళ విరేచనాలు, తలనొప్పి, కళ్ళు తిరగడం జరగవచ్చు. వీటితోపాటు మైక్రో న్యూట్రియంట్స్, మినరల్స్ కూడా లభించాలి. మినరల్స్, ఐరన్, కాల్షియమ్, కాపర్, బోరాన్, సిలికాన్, మాలిబ్డినమ్ మొదలైనవి కనీస స్థాయిలో ఆహారంలో లభించాలి. ఇవి తీసుకోకపోతే రకరకాల జబ్బులురావచ్చు. ఒక లెక్క ప్రకారం మనిషిలో ఏదో విధంగా 34 రకాల విటమిన్లు, మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ లభించే పరిస్థితి ఉండాలి.
మైక్రో న్యూట్రియంట్స్ శరీరంలో ఉండే కణాలలో జరిగే రసాయనిక ప్రక్రియలో భాగంగా జరిగే ఆక్సిడేషన్, రిడక్షన్‌లలో అవి ఎంజైములకు కో ఎంజైములకు సహాయకారులుగా కేటలిస్టులుగా పనిచేస్తాయి. ఇవి ఏ మాత్రం దొరకని ఆహారం తీసుకునే వ్యక్తి పలు రకాల చిన్న చిన్న రుగ్మతలలో బాధపడుతుంటాడు.
ఉదాహరణకు తొందరగా తలమీద జుట్టు ఊడడం, చిన్నతనంలోనే వెంట్రుకలు తెల్లబడటం, బలమైన ఆహారం తీసుకుంటున్నప్పటికి అవి శరీరంలోకి ప్రవేశించక త్వరగా నిస్సత్తువకు లోనవడం జరుగుతుంది. ఇవేకాక తెల్ల నల్ల మచ్చలు చర్మంమీద పడడం చర్మం ముడతలు పడడం, చర్మం మందంగా మారడం లాంటి వ్యాధులు రావచ్చు. సాధారణంగా ఈ మైక్రోన్యూట్రియంట్స్ అనేవి మనం తినే ఆహారంలో ఉంటాయి. ఇవి మనం వండే విధానం, తినే పద్ధతి, జీర్ణక్రియ, ఎనిమిలేషన్ మీద ఆధారపడతాయి. అందుచేత ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారం మొలకెత్తిన గింజలు, అనాస, సీతాఫలం లాంటివి, కాయగూరలు, డ్రైఫ్రూట్స్ బాగా తినాలి. డ్రైఫ్రూట్స్‌లో ఎక్కువ బలం ఉంటుంది. అంటే తక్కువ మోతాదులో ఎక్కువ శక్తి.
ఒక్కో పదార్థం శరీరానికి ఒక్కో విధంగా కేలరీలను ఇస్తుంది. చాలా తక్కువ మోతాదులో ఉన్నటువంటి క్రొవ్వు పదార్థం దానికన్నా అనేక రెట్లు ఎక్కువగా తీసుకున్నా పిండి పదార్థాలు, ప్రొటీన్స్ ఇచ్చే శక్తికి సమానమవుతుంది. అందుకే చాలామంది వైద్యులు క్రొవ్వులు, రకరకాల నూనెలు తక్కువ మోతాదులో తీసుకోమంటారు. ఆహారం, వయసు, లింగభేదం, చేసే పనిమీద వారికి కావలసిన శక్తి ఆధారపడి ఉంటుంది. ఒక్క లెక్క ప్రకారం రోజంతా కష్టపడి పనిచేసే పెద్దలకు సుమారు 2400 కేలరీల శక్తినిచ్చే ఆహార పదార్థాలు కావాలి.
అదేవిధంగా ఆఫీసులో ఉద్యోగాలు చేసేవాళ్ళకు సుమారు 1800 కేలరీలు సరిపోతాయి. చాలామందిలో ఆహార పదార్థాల విషయంలో ఒక అపోహ ఉంది. అదేమిటంటే పాలు, గుడ్లు, మాంసం, పాల ఉత్పత్తులు.. ఇవి చాలా పుష్టినిచ్చే పదార్థాలని భావిస్తారు. ఈ విషయంలో అమెరికా నాసా శాస్తవ్రేత్తలు విస్తృతమైన పరిశోధనలు నిర్వహించి కొన్ని ఆశ్చర్యకరమైన విశేషాలు అందజేశారు.
వాళ్ళు చెబుతున్న దానిని బట్టి ఆహారం తిన్న ఎలుకలకన్నా అర్థాకలితో ఉన్న ఎలుకల ఆయుష్షు 30 శాతం పెరిగింది. రోజు మనం తినే పెరుగు అన్నం అన్నిటికన్నా చాలా శ్రేష్టమైనది. ప్రకృతి సిద్ధంగా లభించే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. పెరిగే వయసు వరకు పౌష్టికాహారం ఉండాలి. ఆ తర్వాత శరీర విధులను నిర్వహించడానికి అవసరమైన కేలరీలు చాలు. తక్కువ ఆహారంలో ఎక్కువ కేలరీలు వచ్చే ఆహారం తీసుకోవాలి. మైక్రోన్యూట్రియంట్స్ ముఖ్యంగా ఉండాలి. లోకాలరీ ఆహారం మంచిది. పలు రకాల పోషక విలువలున్న ఆహారమే కాకుండా శరీరానికి అవసరమయ్యే విటమిన్, మినరల్ కల ఆహారం శరీర ఆరోగ్యానికి మంచిది.

Trupthi - Santhrupthi


తృప్తి - సంతృప్తి

తృప్తి-సంతృప్తి అనే మాటలను సమానార్థకాలుగా వాడుతుంటాం. అలా చేయడం తప్పు కానప్పటికీ ఆ పద ప్రయోగాలమధ్య ఎంతో వ్యత్యాసముంది.
పరమేశ్వరుని అనుగ్రహంవల్ల రూపొందిన ఈ చరాచర సృష్టిని నిశితంగా పరిశీలిస్తే మానవుని ఉత్కృష్టత తెలుస్తుంది. యుక్తాయుక్తాలను వివేచించి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవచ్చో, తదనుగుణంగా బహుళార్థ ప్రయోజనకరంగా మలుచుకునే శక్తి ఇతర ప్రాణులకన్నా మానవునికే అధికం. మనిషి తన భావాలను, అనుభవాలను, అనుభూతుల్నీ ఇతరులతో పంచుకొనగలడు. అప్పుడు మాత్రమే అని జీవితం సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. తన జీవనం ఎంతో ‘తృప్తి’గా ఉందని భావిస్తాడు. అంటే మనిషి మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇటువంటి భావన కలుగుతుంది.
తృప్తి లేదా సంతృప్తి మనస్సుకు సంబంధించిన ఫలాలు. ‘తృపి’ దేహానికి (జీవుడికి) సంబంధించినది. సంతృప్తి అంతరంగానికి (ఆత్మకు) సంబంధించినది. పరిశీలనం చేస్తేనే గాని అవగాహన కాదు.
‘తృప్తి’ అనుభవించడం కర్మేంద్రియాల ద్వారా జరిగితే, ‘సంతృప్తి’ జ్ఞానేంద్రియాలకు మాత్రమే పరిమితం.
ఎండలో నడుస్తున్నవానికి చల్లని నీడ తృప్తినిస్తుంది. అలానే ఆ స్థితిలో దాహార్తికి చల్లని నీళ్ళు తృప్తి కలిగిస్తుంది. ఆకలితో సతమతమవుతున్నవానికి పట్టెడన్నంతో కడుపు నింపితే ముఖంలో తృప్తి తాండవమాడుతుంది. పరీక్షల్లో విద్యార్థి కృతార్థుడైనా, నిరుద్యోగికి ఉద్యోగం లభించినా, శ్రమనెంచక ఇల్లు కట్టినా, కూతురుకు పెళ్లిచేసినా ఆ వ్యక్తుల ముఖాలలో కనిపించే ‘తృప్తి’ని మాటలో వర్ణించలేం.
ఒక విధంగా వీటిని చూస్తే ఇవన్నీ కోరికలు. సముద్రంలో అలల వంటివి. ప్రతి కోరిక తీరగానే అంతటితో సమప్తం కాదు. ఆ కోరికననుసరించి మరొక కోరిక పుడుతుంది. ధనం లభించాలనీ, కీర్తిపొందాలనీ పదవి చేపట్టాలనీ- ఇలా ఎన్నో కోరికలు మనిషికి కలుగుతూనే ఉంటాయి. వాటికోసం మనస్సు ప్రేరేపించని మార్గమంటూ లేదు. కోరిక తీరాలనే కాని, ఆ మార్గం ఎటువంటిదని మనస్సుకు తట్టదు. కోరిక తీరితేనే తృప్తి. దొరికినదానితో తృప్తి చెందడం, అంతటితో సరిపెట్టుకోవడం మనసుకు అలవాటు లేదు. మంచి, చెడులు రెండూ మనసుకు రెండు పార్శ్వాలు. లేదా నాణేనికి బొమ్మా, బొరుసులు. ఐహిక వాంఛలకు అలవాటుపడిన దేహానికి ఆ విధంగానే తృప్తిని సమకూరుస్తుంది మనస్సు. అంటే భౌతికంగా మనిషికి లభిస్తున్న తృప్తి మనుస్సు కారణంగా లభిస్తున్నది. ఈ తృప్తి అనిత్యమైనది. అశాశ్వతమైనది.
నిత్యమైనది, శాశ్వతమైనది అయిన తృప్తి వేరొకటున్నది. అంతరంగంలో ఉన్నది. మనోనేత్రం మిథ్యాజగత్తును చూస్తూ అనుభవించేది బాహ్మికమైన తృప్తి. దేహానికి మాత్రమే సంబంధించినది. మనోనేత్రాన్ని అంతరంగంవైపు మళ్లించి వీక్షిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అక్కడ ధర్మ సౌందర్య దర్శనం, ఆత్మానంద జ్యోతి ప్రకాశం గోచరమవుతుంది. విశ్వంలో ప్రతి ఒక్కరూ ఆనందానే్న కోరుకుంటారు. మానవుని సహజ స్థితి ఆనందం అంటాయి ఉపనిషత్తులు. ‘‘ఆనందం మన వారసత్వ సంపద, సంతోషం మన ధనం, శాంతి మన స్వంతం’’- ఇవన్నీ మనలోనే ఉన్నాయి. కాని మనం వాటిని అనుభూతం చేసుకోలేకపోతున్నాం అంటారు స్వామి చిన్మయానంద.
శాంతి వంటి తపస్సు, సంతోషాన్ని మించిన సుఖం లేదు. సాగరంలోని అలలు వంటి కోరికలకు మించిన వ్యాధులు లేవు. దయతో సరితూగగల ధర్మం కూడా లేదని శృతులు వక్కాణిస్తున్నాయి.
మనస్సును అంతర్ముఖం చేసి, ఇంద్రియాలను నియంత్రించి, పరమాత్మను ఆత్మలో దర్శించే సాధన చేయాలి. ఫలాపేక్ష రహితమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన అనంతమైన ప్రేమ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు పరమాత్మ. అక్కడ సదా పరివేష్టితుడై ఉన్నాడు. వైభోగాలకు, భోగాలకు అక్కడ తావు లేదు. అది పరతత్త్వమైన, ఆధ్యాత్మికమైన స్థితి. 

Avivekam - Telugu spirutual


అవివేకము



భగవాన్ శ్రీకృష్ణపరమాత్మ శ్రీ భగవద్గీతలో అర్జునునితో జ్ఞాని అయిన వాడు నాకత్యంత ప్రియమైన వ్యక్తి. మనుష్యులలో బుద్ధిమంతు వారలలో బుద్ధిని నేనే. వివేకము బుద్ధియోగమునే ఆశ్రయించాలి, ఎందుకంటే అది ఫలహేతువు కనుక. దానివలననే ఫలితము కలుగును. ఆ ఫలితమునే అనుభవింపవలసి వచ్చును. మానవులు ఎల్లప్పుడును సమబుద్ధి యందే రక్షణోపాయమును పొందవలెను. రకరకములైన మాటలు వలనను, అవి వినుట వలనను వాదనల వలనను బుద్ధి విచలితమై స్థిరముగా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది.
అలాంటప్పుడు స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి. వివేకము కోల్పోరాదు. ఎటువంటి పరిస్థితుల్లోను సుఖ దుఃఖాలలో గాని ద్వేషములందుగాని బుద్ధి స్థిరమైనదిగా ఉండాలి. ఎవని మనస్సు, ఇంద్రియములు వశమై ఉండునో అతని బుద్ధి స్థిరముగా నుండును. విషయములందు సదా ఆలోచించువానికి వానియందాసక్తి కలుగును. ఆ ఆసక్తివలన విషయములపట్ల కోరిక కలుగును. కోరిక తీరక విఘ్నములేర్పడినప్పుడు క్రోధము కలుగును, క్రోధమువలన మూఢభావము కలుగుతుంది. దానివలన స్మృతి భ్రమిస్తుంది. స్మృతి భ్రమించినప్పుడు జ్ఞానశక్తి నశిస్తుంది.
అలా నశించినప్పుడు తానున్న స్థితినుండి దిగజారి పతనము మొదలవుతుంది. బుద్ధి వివేకము కోల్పోయి అవివేకము కలుగును. అవివేమువలన నిర్వర్తించు కార్యములు సక్రమంగా జరుగక నాశనము ప్రాప్తించును. చివరకు ప్రాణోపాయము కలుగును. బుద్ధి ద్వారా మనస్సును వశము గావించుకుని జాగరూకతతో సంచరించాలి. వివేకముతో జీవనము సాగించాలి.
దేవుడు ప్రాణికోటికంతటికిని బుద్ధిని ఎంతో కొంత ప్రసాదించాడు. ముఖ్యంగా మానవజాతి బుద్ధి వివేకములతో సక్రమ మార్గమున నియంత్రించగలిగితే అంతా ధర్మమే నాలుగు దిక్కుల ప్రభవిల్లుతుంది. అంతటా శాంతి సౌభాగ్యాలే వెల్లివిరుస్తాయి. అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. అయితే ప్రాచీన కాలం నుండి కొంతమంది బుద్ధిని సరిగా ఉపయోగించక తమ అవివేకముతో నాశనమయ్యారు. వారిలో.. దుర్యోధనుడు సోదరులతో శత్రుత్వం వహించి పోరు సల్పి అవివేకి అయ్యాడు. ధృతరాష్ట్రుడు పుత్రప్రేమతో దుర్యోధనుని ఆగడాలు అనుమతించి అవివేకి అయ్యాడు.
శూర్పణఖ మాటలు విని సీతను అపహరించిన రావణుడు ఒక అవివేకి, దురాశచే దూరాలోచన లేక సులభంగా ధనార్జన చేసేవాడు అవివేకి, తాను కూర్చున్న చెట్టుకొమ్మను తానే నరుక్కున్నవాడు అవివేకి. ఈతకాయతో తాటికాయ కోరేవాడు అవివేకి. వాత్సల్యంతో పిల్లలను అతి ముద్దుచేసే తల్లిదండ్రులు అవివేకులు. పరుల మెప్పుకోసం ప్రాకులాడేవాడు అవివేకి. అనాలోచితంగా తొందరపాటుతో అపాయంలో చిక్కుకున్నవాడు అవివేకి. రావణాసురుడు, దుర్యోధనుడు, వాలి, కంసుడు, హిరణ్యకశిపుడు మొదలగు వారందరూ సర్వనాశనం కావడానికి కారణం వారి అవివేకమే. నేడు ఎంతోమంది ఉన్నత స్థాయి నుండి అథమ స్థాయికి చేరడానికి కారణం అవివేకమే. అయితే ఉపాయంతో, బుద్ధితో, వివేకంతో అపాయాన్ని తప్పించుకొనేవాడు వివేకవంతుడు.
మంచిమాట శీర్షికకు
ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు.
రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.
ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

Indriya nigraham


ఇంద్రియ నిగ్రహం


మానవుడు మోక్ష మార్గం పొందాలంటే స్థిరచిత్తం ఉండాలి. మామూలుగానే మనస్సు పరిపరి విధాలపోతూ ఉంటుంది. ఎన్నో కోరికలు మనస్సును అనేక విధాలుగా అన్నివైపులకి లాగుతూ ఉంటాయి. పరీక్షకు చదువుకోవాల్సిన విద్యార్థి మనస్సు చలనచిత్రం వైపు పోతుంది. వంట చెయ్యవలసిన గృహిణి హృదయం టీవీలోని సీరియల్‌వైపు మొగ్గుతుంది. ఆఫీసులో ఫైలు చూడకుండా ఉద్యోగి క్రికెట్ స్కోర్ గురించి ఆలోచిస్తాడు. లౌకికమైన విషయాల పట్ల ఫలితం వెంటనే కనిపిస్తుంది. అటువంటి సాధారణ లౌకిక విషయాలపైనే ఏకాగ్రత సాధించడం కష్టమైనప్పుడు పరమాత్మపై ధ్యానం సులభసాధ్యమా?
ఒకవేళ ఎవరైనా మోక్ష సాధనకై ప్రయత్నించాలనుకున్నా వారికి అనేకులు అనేక రకాలైన బోధలు చేస్తారు. ఈ మార్గంలో వెడితేనే, ఈ రూపంలో భగవంతుని ఆరాధిస్తేనే మోక్షం లభిస్తుందని చెప్తారు. ఇటువంటివి అనేక విషయాలు వినటంవల్ల మనస్సు కలత చెందుతుంది. ఆ పరిస్థితిని పరిహరించమని శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా సకల మానవాళికి సందేశమిచ్చాడు.
‘శ్రుతి విప్రతిపన్నాతే, యదాస్థాస్యతి నిశ్చలా, సమాధావచలాబుద్ధి స్తదా యోగమవాప్స్యసి (2-53) నానావిధాలైన వాదాలు విని ఉండటంవల్ల కలత చెందిన నీ మనస్సు ఎప్పుడు చలించకుండా పరమాత్మ ధ్యానంలో స్థిరంగా నిలిచి ఉంటుందో అప్పుడు నీవు ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలవు. అనేక రకాలైన మాటలు వినటంవల్ల ఏది నిజమో తెలియక మనస్సు పరిపరి విధాలుగాపోతుంది.
ఆ పరిస్థితిలో ఆ మాటలన్నింటిని మరిచిపోయి, ఇహలోక విషయాలపై ఆసక్తిని వదిలి, పరమాత్మ ధ్యానంలో మనస్సును స్థిరంగా ఉంచితే పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆ స్థితినే యోగమంటారు. యోగమన్న మాటకు ఐక్యమని అర్థం. జీవాత్మ పరమాత్మలో కలియడమే యోగం.
ఉప్పునీటిలో కరిగినట్లు ఆత్మపరమాత్మలో ఐక్యమైననాడు శాంతినీ, పరమానందాన్ని పొందగలుగుతాము. చిత్తం చాపలంగా ఉంటే ధ్యానం సాధ్యంకాదు. యోగ స్థితి లభించదు. సూదిలోకి దారం ఎక్కించాలంటే చెయ్యి వణక కూడదు. దారం కొన సన్నగా ఉండాలి. అదే విధంగా ఏకాగ్రత, ఇంద్రియ నిగ్రహం ఉంటేనే మనస్సు ఆత్మలోకి ప్రవేశిస్తుంది.
ప్రతి జీవి యొక్క లక్ష్మమూ మోక్షసాధన మాత్రమే. ఆ విషయాన్ని మర్చిపోయి మానవులు ఆహార నిద్రా మైథునాల గురించీ, ఇతర భోగాల గురించీ, వస్తు సముదాయార్జన గురించీ ఆలోచిస్తారు. అలాకాకుండా మనస్సుని భగవంతుడిపై నిశ్చలంగా లగ్నంచేస్తే మోక్షం సాధించగలం. మోక్షం సాధించినప్పుడే మానవజన్మకు సార్థకం చేకూరుతుంది.
మనసును భగవంతుని కథలు వినడంపైమళ్లిస్తే మెల్లమెల్లగా మనసు వాటి రుచి తెలుసుకొంటుంది. ఆ తర్వాత భగవంతుని పై ఆసక్తిని ఏర్పరుచుకుంటుంది. భగవంతుని గురించి ఆలోచనలు పెంచుకుంటుంది. క్షణమైన ఆలస్యం లేకుండా ఆలోచించే మనస్సు వివిధ పనులను చేసిన చేస్తున్న భగవంతుని కథామృతంలోని మర్మంగురించి బాగా ఆలోచన చేస్తుంటుంది. ఇదే అదునుగా మనిషి తన జన్మను సార్థకం చేసుకోవడానికి మనస్సును స్థిరంగా భగవంతునిపైనే నిలపడానికి తన ప్రయత్నం తాను మొదలుపెడ్తాడు. ఆ తరవాత భగవంతుని కృప తోడు అవుతుంది. ఆ తర్వాత ఏకాగ్రత నిలుస్తుంది. అన్యం ఆలోచించేమనసుకు నిజమేదో తెలుస్తుంది ఇక ఎపుడూ శాశ్వతమైనది, ఆనందకరమైనది అయన భగవంతుని తత్వాన్ని ఆకళింపుచేసుకొనే స్థాయని పొందుతుంది.

Dyana Yogam - Telugu spirutual


ధ్యానయోగం


పరమాత్మ సాక్షాత్కారం కోసం సాధకులు ఏకాగ్రతతో చిత్తమందు భగవంతుని రూపాన్ని నిల్పుకొని నిరంతరం అర్చించే చర్యనే ధ్యానయోగం అని అంటారు.
ధ్యానయోగానికి పూనుకునేవారికి కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటుచేయబడ్డాయి. వారు ఆ నియమ నిబంధనలు పాటించినట్లయితేనే ధ్యానయోగం సఫలీకృతమవుతుంది. ధ్యానయోగులు తమ మనసులోకి ఏ భయాన్నీ రానీయరాదు. భయంవల్ల మనస్సు చంచలమై పరమాత్మయందు లగ్నం చేయడం చాలా కష్టమవుతుంది. సర్వవ్యాపి, సర్వరక్షకుడైన భగవంతుడు తనకు అండగా ఉంటాడని విశ్వసించాలి. అలా చేయడంవల్ల భయం వారి దరిచేరదు. అలాగే వారు మరణం విషయమై ఏ మాత్రం దిగులు చెందకూడదు. ధ్యానయోగంలో ఉన్న సమయంలో అనుకోకుండా మరణమే సంభవించినా అది వారికి శ్రేయోదాయకమై మోక్షప్రదమవుతుంది. అందువల్ల ధ్యానయోగులు ఏ విషయానికీ వెరువకుండా ధ్యానయోగం మొదలు పెట్టాలి.
ధ్యానసమయంలో రాగద్వేషాలకూ, సుఖ దుఃఖాలకూ, కామక్రోధాలకూ, ప్రాపంచిక సంకల్ప, వికల్పాలకూ అతీతులై ఉండాలి. ప్రశాంత చిత్తంతో ధ్యానయోగం కొనసాగించాలి.
ధ్యానయోగాలు నిద్ర, సోమరితనం, అలసత్వం, ప్రమాదాది అవరోధాల్ని అధిగమించాలి. సావధాన చిత్తంతో మెలగుతూ ఏ మాత్రం ఏమరుపాటు లేకుండా ఉండాలి. ఏమరుపాటు కలిగితే మనస్సు, ఇంద్రియాలు పక్కదారి పట్టి ధ్యానానికి ఇబ్బందులు అవుతాయి. ధ్యానయోగ సమయంలో సాధకులు మిక్కిలి యుక్తియుక్తంగా వ్యవహరించడం అలవరచుకోవాలి.
నిలకడ లేని మనస్సును బలవంతంగా నిగ్రహించడానికి ప్రయత్నించినా అది విషయ సుఖాలవైపు పరుగులు తీయడం సహజం. అందువల్ల దృఢ సంకల్పంతో మనసును అదుపులో ఉంచుకోవాలి. బాహ్య విషయాలనుండి మనస్సును మరలించి భగవంతునియందు లగ్నం చేసి ధ్యానయోగం కొనసాగించాలి.
అత్యాధునిక పరిస్థితులు, పరికరాలు మనస్సులను ఆకర్షించి తమవైపు తిప్పుకునేందుకు సర్వదా ప్రయత్నిస్తూనే ఉంటాయి. అట్టి సమయాల్లో తగినంత నిగ్రహాన్ని పాటిస్తూ నియమ నిబంధనలకు నీళ్ళొదలకుండా ధ్యాన యోగాన్ని కొనసాగించాలి.
గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ ధ్యానయోగ సాధనా సమయంలో నిర్దేశింపబడిన నియమాలను ఏ మాత్రం ఉల్లంఘించరాదు. మనుస్మృతి మొదలైన శాస్త్రాల్లో ధ్యానయోగ సమయాల్లో బ్రహ్మచర్యం పాటించాలని తెలుపబడింది. ధ్యానయోగ సాధకులు బాహ్య అందాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వకుండా అంతఃసౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు కృషిచేయాలి.
ధ్యానయోగ సాధకులు తమ తల్లిదండ్రులనూ, గురువులనూ, పెద్దలనూ గౌరవించాలి. వారి యెడ వినయ విధేయతలతో ప్రవర్తించాలి. ఎవరితోనూ ఎట్టి వివాదాలూ సల్పకుండా వివాద రహితులై ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరినీ నిందింపరాదు. జూదం జోలికి పోరాదు. సాత్త్వికమైన ఆహారానే్న భుజించాలి. సత్యవ్రతులై మెలగాలి. అహింసామార్గవర్తులై ఉండాలి. అరిషడ్వర్గాలను జయించాలి. ఈ నియమాలన్నీ పాటిస్తూ ధ్యానయోగంతో మోక్షాన్ని పొందగలగాలి.
ధ్యానయోగులు తమకు ఇష్టమైన దైవ స్వరూపాన్ని చిత్తంలో ప్రతిష్ఠించుకొని ధ్యానం చేయవచ్చు. ‘సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి’ అన్నట్లుగా ఏ రూపాన్ని పూజించినా, ధ్యానించినా అది పరమాత్మకే చెందుతుంది.
ధ్యానం నిర్గుణ పరబ్రహ్మను కాకుండా సగుణ పరమేశ్వర ధ్యానంగా ఉండాలి.
మత్పరాయణులు అనన్య భావంతో చిత్తాన్ని పరమాత్మ యందే లగ్నం చేసి ధ్యానం చేస్తారు. భగవత్పరాయణులు భగవల్లీలా విలాసాల యందే సంతుష్టులౌతా
రు

Vepa - facepack

ఫేస్‌ ప్యాక్స్‌తో నిగనిగ (10-May-2015)

అందమైన, నునుపైన చర్మం కోసం ప్రతి మహిళా తహతహలాడుతుంది. అయితే బిజీ జీవితం వల్లనో లేదా చుట్టూ ఉండే వాతావరణ కాలుష్యం, సమ్మర్‌లో శరీరంపై సూర్యకిరణాలు పడటం వల్ల కావచ్చు... ఇలాగ ఉన్నపుడు చర్మం నిగారింపు తగ్గటం ఖాయం. శరీరంపై ఉండే మొటిమలు, చిన్నపాటి నల్లటి స్పాట్స్‌ని తొలగించాలంటే ఇంట్లోనే అందుబాటులో ఉండే హోమ్‌రెమెడీ్‌సతో ఫేస్‌ప్యాక్స్‌ తయారు చేసుకోవచ్చు.
అదెలాగో తెల్సుకుందాం.
 
వేపాకు, శెనగపిండి ఫేస్‌ప్యాక్‌
కావాల్సిన పదార్థాలు : 1 టేబుల్‌ స్పూన్‌ శెనగపిండి, 1 టీ స్పూన్‌ పెరుగు, రెండురెమ్మల వేపాకులు లేదా చిటికెడు వేపపొడి.
 
తయారీవిధానం : తొలుత ఒక కప్పులో పెరుగును తీసుకుని ఆ తర్వాత శెనగపిండి వేసి మిక్స్‌ చేయాలి. తర్వాత వేపపొడి లేదా వేపాకుల్ని కలిపి మూడింటినీ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడిగేసుకోవాలి. ఈ ప్యాక్‌లోని పెరుగు వల్ల ముఖచర్మం సాఫ్ట్‌గా తయారవుతుంది. వేపాకు వల్ల చర్మం కాంతివంతం అవుతుంది. దీంతో పాటు యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. 
 
బాదం, కుంకుమపువ్వు ఫేస్‌ప్యాక్‌
కావాల్సిన పదార్థాలు : 5 బాదం గింజల, 1 టేబుల్‌ స్పూన్‌ తేనె, కొంచెం కుంకుమపువ్వు, 1 టీస్పూన్‌ నిమ్మరసం.
 
తయారీవిధానం : ఫేస్‌ప్యాక్‌ చేసుకోవాలనుకున్న ముందురోజు రాత్రే పాలలో లేదా నీటిలో 5 బాదం గింజల్ని నానబెట్టాలి. దీంతో పాటు 2 టేబుల్‌ స్పూన్ల వేడిపాలలో తీసుకున్న ఆ కాస్త కుంకుమపువ్వుని నానబెట్టాలి. ముందుగా ఆ 5 బాదం గింజల్ని పేస్ట్‌లా గ్రైండ్‌ చేసుకోవాలి. దానికి కుంకుమపువ్వు, తేనె, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌కి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత ముఖం కడిగేసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ని తరచుగా అప్లై చేస్తే ముఖంలో చక్కటి గ్లో వస్తుంది.
 
అరటి ఫేస్‌ప్యాక్‌
కావాల్సిన పదార్థాలు : 1 అరటి పండు, 1 టేబుల్‌ స్పూన్‌ పెరుగు, 1 టీ స్పూన్‌ నిమ్మరసం, 1 టీస్పూన్‌ తేనె
 
తయారీవిధానం : మొదట ఒక బౌల్‌ తీసుకుని అరటి పండును చిన్నపాటి ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత బౌల్‌లో తేనె, నిమ్మరసం కలిపి పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ మెత్తని పేస్ట్‌ని ముఖంతో పాటు మెడ భాగాలకి పట్టించుకోవాలి. ఈ పేస్ట్‌ ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తుంటే చర్మం తప్పకుండా కాంతివంతంగా మెరుస్తుంది.

Food that helps the growing nails beautifully - telugu tips

ఈ ఐదింటితో మీ గోళ్లు మిల మిల...

చేతి గోళ్లు అందంగా కనపడాలంటే మెనిక్యూర్‌ ఒక్కటే మార్గం కాదు. గోళ్ల పైభాగం అందంగా కనిపించాలంటే వాటి లోపలి భాగం కూడా ఆరోగ్యంగా ఉండాలి. సమతులాహారం తీసుకుంటే గోళ్లు ఆరోగ్యంగా...దృఢంగా ఉంటాయి. అందంతో మెరిసిపోతాయి.
 
లివర్‌ తింటే మంచిది....
ఐరన్‌ లోపం ఉంటే గోళ్లు చిట్లిపోతాయి. అందుకే మాంసాహారులు లివర్‌ బాగా తినాలి. లివర్‌లో గోళ్లకు కావలసిన ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. శాకాహారులైతే పాలకూర, కాయధాన్యాలు, బీన్స్‌, బెల్లం వంటివి తినాలి. వీటిల్లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా తినడం వల్ల గోళ్లు చిట్లకుండా ఆరోగ్యంగా ఉంటాయి.
 
చేప...
చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ బాగా ఉంటాయి. అంతేకాదు చేపలో కావాలసినన్ని ప్రొటీన్లు, సల్ఫర్‌ కూడా ఉంటాయి.. మకేరల్‌, సాల్‌మాన్‌ వంటి చేపల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి గోళ్లకు కావాల్సిన తేమను అందిస్తాయి. అంతేకాదు సన్నగా, బలహీనంగా ఉండే గోళ్లను బలంగా, మృదువుగా తయారుచేస్తాయి. ఫాస్ఫరస్‌, సల్ఫర్‌ రెండూ గోళ్లను గట్టిగా, దృఢంగా ఉంచుతాయి.
పాల ఉత్పత్తులు...
గోళ్లల్లో కెరటిన్‌ అనే ప్రొటీన్‌ ఉంటుంది. పెరుగు, పాలు, వెన్న లాంటి పాల ఉత్పత్తుల్లో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గోళ్లల్లో ఉండే కెరటిన్‌కు మరింత దోహదకారులుగా పనిచేస్తాయి. కాల్షియం, బయొటిన్‌లు గోరు పైభాగాన్ని పటిష్టంగా ఉంచుతాయి. గోళ్లు చిట్లిపోకుండా కాపాడతాయి.
తెల్ల సొన...
తెల్లసొన పోషకాల నిలయం. ఇది గోళ్లల్లో ఉండే కెరటిన్‌ని పటిష్టంగా తయారుచేస్తుంది. తెల్లసొనలో బయొటిన్‌ కూడా అధికపాళ్లల్లో ఉంటుంది. గుడ్డును ఉడకబెట్టి అందులోని తెల్లసొనను తింటే గోళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
 
గింజలు...
జింకు లోపం చాలామందిలో చూస్తుంటాం. దీనివల్ల గోళ్లు ఎంతో బలహీనంగా ఉండి ఇట్టే చిట్లిపోతుంటాయి. అంతేకాదు గోళ్ల పైభాగంలో చిన్న చిన్న తెల్లటి మచ్చలు కూడా వస్తాయి. ఇవి రాకుండా, గోళ్లు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం గుమ్మడిగింజలు, నువ్వు గింజలు, ఓట్స్‌ తింటే మంచిది. వీటిల్లో జింకు బాగా ఉంటుంది

Nurons - sleep

న్యూరాన్లు తగ్గితే అరకొర నిద్రే

శరీర పోషణ , ఇతర ఆరోగ్య విషయాల్లో ఎన్ని జాగ్రత్తలైనా తీసుకోవచ్చు. కానీ, నిద్ర ఒకటి కరువైతే తీసుకున్న ఏ జాగ్రత్తలూ పెద్ద ప్రయోజనాన్నివ్వవు. అందుకే నిద్రలేమి సమస్య మీద దశాబ్దాల కాలంగా ఎంతో తీవ్రమైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక్కో పరిశోధన ఈ సమస్యనుంచి విముక్తి పొందడానికి ఎంతో కొంత ఉపయోగపడుతోంది. అదే క్రమంలో మన ముందుకొచ్చిన ఈ కొత్త పరిశోధనా ఫలితాల్ని ఒకసారి గమనించండి...

అసలే నిద్ర పట్టకపోవడం ఒక సమస్య అయితే, నిద్రపట్టినట్టే పట్టి పదే పదే మెలకువ రావడం మరో సమస్య. పదే పదే మెలకువ వచ్చే వాళ్లల్లో తామసలు నిద్రేపోలేదన్న భావనే ఉంటుంది. దీనికి మెదడులోని న్యూరాన్లు కొన్ని అదృఽశ్యమైపోవడమే కారణమని ఇటీవలి కొన్ని అధ్యయనాల్లో బయటపడింది. ప్రత్యేకించి వయసు పైబడిన వారికి నిద్రపట్టకపోవడానికి లేదా పదేపదే మెలకువ రావడానికి గల కారణాల్లోకి వెళితే పలురకాల అంశాలు వెలుగులోకి వస్తాయి. ముఖ్యంగా వయసు పైబడుతున్నప్పుడు శరీరమంతా సమాచారాన్ని చేరవేసే నరాల కణసంపత్తిని మెదడు కోల్పోతుంది. కొంత మంది శాస్త్రవేత్తల బృందం 1997 నుంచే ఒక సమాచారాన్ని సేకరిస్తూ వస్తున్నది. అందులో భాగంగా 65 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉన్న వారిని వారి మరణించే దాకా పరిశీలిస్తూ వచ్చారు. అదే క్రమంలో రోగగ్రస్తులైన వారి మెదడును కూడా అధ్యయనం చేశారు. అందులో వారు మెదడులోని కొన్ని విభాగాల్లో ఉండవలసిన న్యూరాన్లకన్నా తక్కువగా ఉండడం వారు గమనించారు. ప్రత్యేకించి, హైపోథలామిక్‌ వెంట్రోలేటరల్‌ ప్రియాప్టిక్‌ న్యూస్లస్‌లకు వీరి నిద్రా సమస్యలకు సంబంధం ఉన్నట్లు వీరు కనుగొన్నారు. ఈ వివరాలన్నింటినీ 7 నుంచి 10 రోజుల పాటు రిస్ట్‌బాండ్‌ పరికరం ద్వారా రికార్డు చేశారు. ఇదే విభాగంలో నిద్రాభంగం చేసే కొన్ని న్యూరాన్లను కూడా వారు కనుగొన్నారు. ఇలా న్యూరాన్లు తగ్గిపోవడం అన్నది అల్జీమర్‌ వ్యాధిలో కూడా కనిపిస్తుంది. అంతకు ముందు జరిగిన పరిశోధనల్లో కూడా మెదడులో సరిపడా న్యూరాన్లు లేని స్థితిలో నిద్ర స్థిరంగా ఉండడం సాధ్యం కాదని స్పష్టమయ్యింది. నిద్రలేమి సమస్యకు ఒకటిరెండు కాదు వందలాది కారణాలు బయటపడుతున్నాయి. ఇదే తరహా పరిశోధనల్లో ఇప్పుడు ఈ కొత్త విషయం వెలుగు చూసింది. ఏమైనా నిద్రను నిలకడగా ఉంచడంలో న్యూరాన్ల పాత్ర కీలమకమన్న విషయం స్పష్టమయ్యింది. ఈ పరిశోధనా ఫలితాల వ వల్ల నిద్రలేమి సమస్యను, ఆల్జీమర్‌ వ్యాధి చికి త్సలో వైద్య రంగం ఎంతో పురోగతి సాధించే అవకాశం మాత్రం కచ్ఛితంగా ఉంటుంది. వచ్చిన వైద్యఫలితాల్ని వచ్చినట్టే అంది పుచ్చుకుంటే గాఢమైన నిద్ర, నిండైన ఆరోగ్యం మన సొంతమవుతాయి

What is varicose veins? how to resolve it?

వెరికోస్‌ వెయిన్స్‌తో సతమతం

టీచర్లు, ట్రాఫిక్‌ పోలీసులు, సెక్యూరిటీగార్డులు, మార్కెటింగ్‌ ఉద్యోగులు.. ఇలాంటి వాళ్లందరూ గంటల తరబడి నిల్చుని ఉద్యోగం చేయాల్సి వస్తుంది. దీనివల్ల మన దేశంలో ఏడు శాతం మందికి వెరికోస్‌ వెయిన్స్‌ వస్తోందని ఒక తాజా అధ్యయనంలో తేలింది. కాళ్లలోని పిక్కలు, కింది భాగంలోని నరాలు మెలికలు తిరగడం, ఉబ్బడం ఈ వ్యాధి లక్షణం.
 
ముంబయిలోని వోక్‌హార్ట్‌ హాస్పిటల్‌ ఈ తాజా సర్వేను చేపట్టింది. చాలా మంది జబ్బు కనిపించిన వెంటనే వైద్య చికిత్స తీసుకోరు. అలాగే వదిలేస్తే.. కొన్నాళ్లకు పలు రకాల కాంప్లికేషన్స్‌ వస్తాయన్నది సర్వే నిపుణుల అభిప్రాయం. దాంతోపాటు మొండివ్యాధిగా మారే అవకాశం కూడా ఉంది. చాలామంది నరాలు ఉబ్బిన జబ్బును పెద్దగా పట్టించుకోరు. డయాగ్నసిస్‌ చేయించుకోరు. ముంబయిలోని వంద మంది ట్రాఫిక్‌ పోలీసులను వెరికోస్‌ వెయిన్స్‌కు సంబంధించిన పరీక్షల్ని చేశారు. వీరిలో అయిదు శాతం మందికి సమస్య ఉన్నట్లు తేలింది. ‘జబ్బు జీవితాన్ని ఏమీ చేయదుకాని కొంత జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం చేయడం వల్ల నరాలు బలహీనపడతాయి. ఇక్కడ మరొక సమస్య ఉంది- వెరికోస్‌ వెయిన్స్‌ సహజంగా పైకి కనిపిస్తుంది. అంటే నరాలు ఉబ్బినట్లు, మెలికలు తిరిగినట్లు కనిపిస్తాయన్నమాట. అయితే కొందరిలో ఇలా కనిపించదు. వీరికి జబ్బును గుర్తుపట్టడం కష్టం. కేవలం డయాగ్నసిస్‌ ద్వారా మాత్రమే నిర్ధారించగలము. సకాలంలో బాధితులకు చికిత్స చేయకపోతే శస్త్రచికిత్స కూడా అవసరం కావొచ్చు. ఈ జబ్బుకు ఇప్పుడు అత్యాధునిక వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అలాంటిదే - ఎండో వెనస్‌ లేజర్‌ థెరఫీ (ఈఎల్‌విటి). ఇది చాలా సులువైన సురక్షితమైన చికిత్స. డేకేర్‌ అడ్మిషన్‌లోనే చేయించుకుని ఇంటికి వెళ్లొచ్చు’నని అధ్యయనకారులు పేర్కొన్నారు

If young mummies to be slim - fallow these tips

యంగ్ మమ్మీలు స్లిమ్‌గా ఉండాలంటే... 

పిల్లలు పుట్టిన వెంటనే వేగంగా సన్నబడిపోవాలని నేటి తరం అమ్మలు కోరుకుంటున్నారు. కానీ ఇది మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మెలమెల్లగా వర్కవుట్ల సంఖ్యను పెంచుతూ మాత్రమే ఒంట్లోని కొవ్వును కరిగించుకోవాలని సూచిస్తున్నారు.
 
బాలివుడ్‌ తారలు ఐశ్వర్యారాయ్‌, శిల్పా శెట్టి, కాజోల్‌, కరిష్మా, ఇంకా జెన్నిఫర్‌ లోపెజ్‌, అమెరికన్‌ మోడల్‌ సారా స్టాగ్‌ వంటి సెలబ్రిటీలను చూస్తుంటే వీళ్లు పిల్లల తల్లులా అని ఆశ్చర్యమేస్తుంది. తమ నాజూకైన శరీర లావణ్యంతో వీళ్లు ఎందరినో ఆశ్చర్యపరుస్తున్నారు. కొత్తగా తల్లులైన నేటి వివాహిత యువతులు తాము కూడా సినీతారల్లాగ స్లిమ్‌గా కనిపించాలని కోరుకుంటున్నారు. బిడ్డను ప్రసవించిన కొద్ది రోజులకే స్లిమ్‌గా అయిపోవాలని తాపత్రయ పడుతున్నారు. అందుకోసం తీవ్రస్థాయిలో వ్యాయామాలను చేస్తున్నారు. కానీ... అలా చేయడం వారి ఆరోగ్యానికి ప్రమాదకరం.
వేగంగా బరువు తగ్గొద్దు...
పిల్లల్ని కన్న వెంటనే బరువు తగ్గడానికి ప్రయత్నించడం వల్ల శారీరకంగా పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. హఠాత్తుగా బరువు తగ్గినా శరీరం తట్టుకోలేదు. ముఖ్యంగా చిన్నారులకు తల్లిపాలను పట్టే అమ్మలు లావుతగ్గడానికి ప్రయత్నించ కూడదు. డైటింగ్‌ కూడా వాళ్లకి మంచిది కాదు. అయినా చేయడానికి ప్రయత్నిస్తే శరీరంలోని పోషకవిలువలు తగ్గిపోయి రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే కొత్తగా బిడ్డను కన్న తల్లులు మెల్లగా బరువు తగ్గాలి.
ప్రసవానంతర వ్యాయామాలు...
బిడ్డను కన్న తర్వాత (పోస్ట్‌ డెలివరీ ఎక్సర్‌సైజెస్‌) చేసే వ్యాయామాలు కొన్ని ఉన్నాయి. ఇవి కొత్తగా తల్లులైన వారి శరీరంలోని కొవ్వును కరిగించడమే కాదు శరీరానికి కావాల్సిన అదనపు ఎనర్జీని అందిస్తాయి. శరీరలోపల భాగాలను సంరక్షిస్తాయి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. మెల్ల మెల్లగా వ్యాయామాల తీవ్రతను పెంచుకుంటూ పోవాలి. నార్మల్‌ డెలివరీ అయితే నాలుగు వారాల అనంతరం వ్యాయామాలు చేయడం ప్రారంభించాలి. సిజేరియన్‌ అయితే ఆరు వారాల తర్వాత వ్యాయామాలు చేయడం మొదలుపెట్టాలి. ఈ వ్యాయామాలు చేస్తే స్లిమ్‌గా తయారవుతారు...
హిప్‌ థ్రస్టర్‌: ఈ వర్కవుట్‌ వల్ల పెల్విక్‌ చుట్టూతా ఉన్న కండరాలు దృఢంగా తయారవుతాయి. శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది.
వి-పోజ్‌ హోల్డ్‌ అండ్‌ పుషప్‌: ఈ వర్కవుట్‌ చేయడం వల్ల పొట్ట దగ్గర పేరుకు పోయిన కొవ్వు వేగంగా కరుగుతుంది. వెన్ను భాగం దృఢంగా తయారవుతుంది.
ప్లాంక్స్‌: ఇవి చేస్తే పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరుగుతుంది.
లాంజెస్‌ అండ్‌ స్క్వాట్స్‌: లెగ్‌ వ ర్కవుట్లలో ఇవి చాలా ప్రధానమైనవి. వీటిని చేయడం వల్ల లోయర్‌ బాడీపై ఒత్తిడి బాగా పడుతుంది. మంచి ఫలితాలు కనిపిస్తాయి.
చెస్ట్‌ వర్కవుట్‌: రొమ్ములు చక్కటి ఆకారంలో ఉండడానికి చెస్ట్‌ వర్కవుట్లు బాగా సహాయపడతాయి.
డెడ్‌లిఫ్ట్‌: ఇది శరీరం మొత్తానికి వ్యాయామం ఇస్తుంది. కొవ్వును తగ్గిస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడే లింఫటిక్‌ గ్లాండ్‌ను క్రమబద్ధీకరిస్తుంది.
ఎలాంటివి తినాలి?
కొత్తగా ‘తల్లు’లైన వాళ్లు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. బరువు తగ్గడానికి వ్యాయామాలు చేస్తున్నాం కదా అని తక్కువ కేలరీలున్న ఆహారం మాత్రమే తిని కడుపు మాడ్చుకోకూడదు. వీళ్లు తినే డైట్‌లో రకరకాల పండ్లు, కూరగాయలు ఉండాలి. పసుపు, ఆరంజ్‌ రంగులున్న పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బొప్పాయి, పీచ్‌, నిమ్మ వంటి వాటిల్లో సి-విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. పండ్లు, కూరగాయల్లో పీచు పదార్థాలతోపాటు తక్కువ పరిమాణంలో మాత్రమే కాలరీలు ఉంటాయి. ఆకుకూరలు కూడా బాగా తినాలి. అలాగే యాంటాక్సిడెంట్లు బాగా ఉన్న ఆహారపదార్థాలు తినడం వల్ల బరువు తగ్గుతారు. రోజూ గ్రీన్‌ టీ తాగడం వల్ల కూడా శరీర బరువు తగ్గుతుంది. పరిమిత స్థాయిలో డ్రైఫ్రూట్స్‌ను స్నాక్‌గా తీసుకుంటే మంచిది. నీళ్లు బాగా తాగాలి. నీళ్లు బాగా తాగితే జీవక్రియ సాఫీగా జరుగుతుంది. అంతేకాదు కొవ్వు సైతం వేగంగా కరుగుతుంది.
ఇవి గమనించాలి...
వ్యాయామాలు చేసేటప్పుడు కొత్తగా తల్లులైన వాళ్లు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. సర్టిఫైడ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పర్యవేక్షణలోనే వ్యాయామాలు చేయాలి. వర్కవుట్లు చేయడం ప్రారంభించేముందు ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించాలి. వ్యాయామాలు చేసేటప్పుడు పొత్త్తికడుపు భాగంలో ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినావర్కవుట్లు చేయడంఆపేయాలి. ప్రసవ సమయంలో కాంప్లికేషన్స్‌ ఎదుర్కొన్న వారు వాకింగ్‌ లాంటి తేలికపాటి వ్యాయామాలను మాత్రమే చేయాలి. అలాగే సులువుగా ఉండే యోగాసనాలను కూడా చేయొచ్చు. రోజుకు 20-30 నిమిషాల చొప్పున వారానికి మూడు పర్యాయాలు వ్యాయామాలు చేస్తే చాలు.
అవి అపోహలే...
బిడ్డను కన్నతర్వాత వర్కవుట్లు చేయడం గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిల్లో స్ర్టెంగ్త్‌ ట్రైనింగ్‌ మంచిది కాదనే అభిప్రాయం ఒకటి. కానీ బిడ్డను కన్న తర్వాత సె్ట్రంగ్త్‌ ట్రైనింగ్‌ చేసిన తల్లులు ఎంతో వేగంగా మంచి ఫలితాలు పొందరని పలు స్టడీలు చెప్తున్నాయి. బిడ్డలు పుట్టిన తర్వాత పొట్ట ఫ్లాట్‌ అవదనేది మరొక అపోహ. ఈ అభిప్రాయం కూడా తప్పే. పొట్ట తగ్గడం చాలామందిలో చూస్తున్నాం. అలాగే తల్లులు వర్కవుట్‌ చేసిన తర్వాత పిల్లలకు ఫీడ్‌ ఇవ్వకూడదంటారు. ఇది కూడా అపోహే. వ్యాయామాలు చేయడం వల్ల బ్రెస్ట్‌ ఫీడింగ్‌పై ఎలాంటి దుష్ప్రభావం పడదు

eating garlic in early morning? - Garlic uses for health

పరగడుపునే వెల్లుల్లి తింటున్నారా?

పరగడుపునే వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఎప్పటికప్పుడు పరిశోధనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. వెల్లుల్లి ఎందుకు తినాలంటే..

- ఇది నాచురల్‌ యాంటీ బయాటిక్‌గా పనిచేస్తుంది. అల్పాహారం తినకముందే రెండు వెల్లుల్లిపాయల్ని తింటే.. కడుపులోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. పొద్దున్నే తినడం వల్ల వెల్లుల్లికి ఈ శక్తి ఎక్కువ.
 
- అధిక రక్తపోటు కలిగిన వాళ్లకు వెల్లుల్లి దివ్యౌషధం. రోజూ క్రమం తప్పకుండా తింటే హైబీపీ నియంత్రణలో ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
- కాలేయం, పిత్తాశయం పనితీరును మెరుగుపరిచే రసాయనాలు వెల్లుల్లిలో ఉన్నాయట. కడుపులోని సమస్యల్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా జీర్ణప్రక్రియల్ని చురుగ్గా ఉంచడంతోపాటు వ్యర్థాలను బయటికి పంపే ప్రక్రియకు దోహదపడుతుంది వెల్లుల్లి. ఆకలిని కూడా పెంచుతుంది.
- మానసిక ఒత్తిళ్లు, డిప్రెషన్‌, గ్యాసి్ట్రక్‌ సమస్యలకు చక్కటి విరుగుడు. కొన్ని రకాల కేన్సర్ల నిరోధానికి కూడా పనికొస్తుంది.
- న్యుమోనియా, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్‌, లంగ్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వంటి వాటికి అడ్డుకట్ట వేస్తుంది. టీబీ బాధితులు కూడా తప్పనిసరిగా వెల్లుల్లిని తింటే మంచిది.
- అయితే వెల్లుల్లితో ఇన్నేసి ఉపయోగాలు ఉన్నప్పటికీ - కొందరికి ఇది తింటే పడదు. చర్మం మీద అలర్జీ వస్తుంది. ఇంకొందరికి శరీరం ఉన్నట్లుండి వేడి చేస్తుంది. తలనొప్పికూడా వస్తుంది. ఇటువంటి వాళ్లు వెల్లుల్లిని తినకూడదు.