Monday 29 September 2014

Fat - Liver

అదనపు కొవ్వుతో కాలేయానికి కష్టాలు

కాలేయం మన శరీరంలోని అంతర్గత అవయవాల్లో చాలా కీలకమైన అవయవం. చాలా ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ఉదాహరణకు శరీరంలోని అదనపు గ్లూకోజ్‌ని గ్లైకోజన్‌గా మార్చుకొని నిల్వ చేసుకుంటుంది. అవసరమైనప్పుడు గ్లైకోజన్‌ని తిరిగి గ్లూకోజ్‌గా మార్చి శరీరంలోకి విడుదల చేస్తుంది. జీర్ణక్రియలో భాగంగా కొవ్వు, ప్రొటీన్లవంటివి సూక్ష్మాంశాలుగా మారడానికి సహాయపడుతుంది. రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన ప్రొటీన్లను తయారుచేస్తుంది. వివిధ సమస్యల కోసం వాడే మందుల పనితీరును నియంత్రిస్తుంది. మద్యం, విషపదార్థాలు, రసాయనాలు, ప్రమాదకర అంశాలు వంటివి శరీరం నుంచి త్వరితగతిన బహిర్గతమయ్యేలా చేస్తుంది. పైత్యరసాన్ని (బైల్ జ్యూస్) తయారుచేస్తుంది. కాలేయం ద్వారా విడుదలైన పిత్తరసం చిన్నపేగును చేరుకొని ఆహారంలో కొవ్వు పదార్థాలను జీర్ణం చేస్తుంది.
ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎఫ్‌ఎల్‌డి) అంటే?
తేలికపాటి భాషలో చెప్పాలంటే కాలేయపు కణజాలాల్లో కొవ్వు అధికమొత్తాల్లో చేరడాన్ని ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. కాలేయపు కణ సముదాయాలు (హెపటోసైట్స్) మామూలుగానే కొంత కొవ్వును, కొవ్వుకు సంబంధించిన పదార్థాలను (ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటీ యాసిడ్స్) కలిగి వుంటాయి. కాలేయంలోని అదనపు కొవ్వు సాధారణంగా కాలేయం నుంచి రక్తప్రవాహంలోకి ప్రవేశించి సర్వశరీరగతంగా వ్యాపించి వుండే కొవ్వు కణ సముదాయాల్లో (ఎడిపోస్ టిష్యూ)లో నిల్వ ఉంటుంది. అయితే ఫ్యాటీ లివర్ వ్యాధిలో అదనపు కొవ్వు శరీరంలోకి వెళ్లకుండా కాలేయపు కణ సముదాయాల్లోనే సంచితమవుతుంది. దీనితో కాలేయపు సామర్థ్యం దెబ్బతిని తదనుగుణమైన సమస్యలు తలెత్తుతాయి. కాలేయపు కణజాలాలు కొవ్వుకు సంబంధించిన పదార్థాలను సమర్థవంతంగా అదుపు చేయలేనపుడు ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుందని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు.
స్థూలకాయం, మధుమేహం, రసాయన పదార్థాలనూ మందులనూ, అధిక మొత్తాల్లో వాడటం (మద్యం, కార్టికోస్టీరాయిడ్స్, టెట్రాసైక్లిన్స్, మెథాట్రేక్సేట్), పోషకాహార లోపం, మాంసకృతులను తగిన మొత్తాల్లో తీసుకోకపోవటం, గర్భధారణ, విటమిన్-ఎని ప్రమాదకర మోతాదులో వాడటం, పేగులమీద శస్త్ర చికిత్స జరగటం, గ్లైకోజన్‌కి సంబంధించిన వంశపారంపర్య వ్యాధి ఉండటం వంటివి అనేకం ఫ్యాటీ లివర్ డిసీజ్‌కి సామాన్య కారణాలు.
కాలేయ వ్యాధులమీద, ముఖ్యంగా ఫ్యాటీ లివర్ వ్యాధిమీద పనిచేసే మూలికలు, ఔషధాలు ఆయుర్వేదంలో అనేకం ఉన్నాయి. వీటి పనితీరుపై ఇటీవల ముమ్మరంగా అధ్యయనాలు జరిగాయి. ఈ వ్యాధితో బాధపడేవారు ఈ అధ్యయన ఫలితాలను, ఆయుర్వేద మూలికల సమర్థతను ఉపయోగించుకోవచ్చు.
వివిధ రూపాలు
ఫ్యాటీలివర్ వ్యాధి వివిధ రూపాల్లో వ్యక్తమవుతుంది. వ్యాధి ఏర్పడే విధానాన్ని బట్టి ఈ వ్యాధిని వర్గీకరించారు. ఇన్‌ఫ్లమేషన్ అంశ లేనిది మొదటి రకం. దీనిని హెపాటిక్ స్టియటోసిస్ అంటారు. కాగా ఇన్‌ఫ్లమేషన్ లేదా వాపు అనే లక్షణం ప్రధానంగా కలిగి ఉండేది రెండవ రకం. దీనిని స్టియటో హెపటైటిస్ అంటారు. ఇది తిరిగి రెండు రకాలు. మద్యాన్ని అధిక మొత్తాల్లో తీసుకోవటంవల్ల వచ్చేది ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్. మద్యం తీసుకోకపోయినప్పటికీ వచ్చేది నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్ (ఎన్‌ఎయస్‌హెచ్)
సింపుల్ ఫ్యాటీలివర్
ఈ వ్యాధి భారతీయుల్లో ఇతర కాలేయ వ్యాధులన్నిటికన్నా ఎక్కువగా కనిపిస్తోంది. కొవ్వు ప్రధాన ఆహార పదార్థంగా ఉండే పాశ్చాత్య దేశాల ఆహారపుటలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనశైలి భారతీయుల్లో పెరగటం దీనికి కారణం కావచ్చు. కాలేయపు బరువులో 5-10 శాతం కంటే ఎక్కువ బరువును కాలేయపు కణజాలాలు కొవ్వు రూపంలో కలిగి ఉంటే సింపుల్ ఫ్యాటీలివర్‌గా చెబుతారు. సాధారణంగా ఈ వ్యాధి ప్రమాదరహితమైనది. దీనితో తీవ్రమైన అనారోగ్యాలంటూ ఏవీ చోటుచేసుకోవు. ఇతరత్రా సమస్యలు లేనివారిలో ఈ స్థితి కారణంగా ఇబ్బందులు తలెత్తవు. అయితే దీనితోపాటు ఇతర అంశాలు తోడైతే మాత్రం ఈ స్థితి సమస్యాత్మకమవుతుంది.
స్టియటోహెపటైటిస్.. కాలేయంలో అధిక మొత్తాల్లో సంచితమైన కొవ్వు పదార్థం ఇన్‌ఫ్లమేషన్‌ని లేదా వాపును కలిగించటంవల్ల స్టియటోహెపటైటిస్ ప్రాప్తిస్తుంది. ఇది దీర్ఘకాలంపాటు కొనసాగితే కాలేయపు కణజాలం గట్టిపడి సిరోసిస్ ప్రాప్తించే అవకాశం ఉంది. ఇది ప్రమాదభరితమైన స్థితి కనుక ఈ స్థితి ప్రాప్తించేవరకూ ఉపేక్షించకూడదు.
*

neck pain - remedy

మెడనొప్పి తగ్గే మార్గం లేదా..?


ప్రశ్న:నా వయసు 32 సం.లు. నేను ఒక కంపెనీలో కంప్యూటర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నాను. నాకు కొంతకాలంగా మెడ కదిలించటంవలన నొప్పి అధికమవుతున్నది. విశ్రాంతి వలన నొప్పి తగ్గుతుంది. అలాగే మలబద్ధకంతో బాధపడుతుంటాను. దాహం అధికంగా కలిగి ఉండి నీరు ఎక్కువగా త్రాగుతాను. మానసికంగా నాకు కోపం ఎక్కువ. కదలికలవలన నాకు బాధలు ఎక్కువవుతున్నాయి. తిమ్మిర్లు ఎక్కువగా ఉండి, కుడి చెయ్యి పైకి ఎత్తడం కష్టంగా మారుతున్నది. దగ్గరలో ఉన్న డాక్టర్‌ని సంప్రదించగా ఎక్స్‌రే తీసి స్పాండిలోసిస్ సమస్యగా నిర్థారించి మెడపట్టి పెట్టుకోమన్నారు. మెడ పట్టిపోయే మార్గం లేదా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు.
రాధ, రంగారెడ్డి
జ: మీ సమస్యకు ‘బ్రయోనియా’ అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పోటెన్సీలో మీరు 15 రోజులకు ఒక్కసారి ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున మూడు నెలలపాటు వాడగలరు. అలాగే కాల్కేరియాఫ్లోర్ 6 ఎక్స్ అనే మందును రోజుకు 4 మాత్రలు మూడుసార్లు చొప్పున రెండు నెలలు వాడగలరు. ఈ సమస్య ముఖ్యంగా వెన్నుపూసలమధ్య ఉన్న కార్టిలెజ్ క్షీణించి, ఆస్టియోఫైట్స్ ఏర్పడటంవలన వస్తుంది. కావున స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీల్లో అసంబద్ధ భంగిమలలో కూర్చోవటం మానుకోవాలి. అలాగే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కాల్షియం ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. పాలు, గుడ్లు, పెరుగు వంటివి తీసుకోవాలి. ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం నివారించుకోవాలి. నొప్పి తీవ్రత తగ్గించుకోవటానికి అతిగా పెయిన్ కిల్లర్స్‌ను వాడకూడదు. నీరు సరిపడినంతగా త్రాగాలి. తాజా కూరగాయలు నిత్యం ఆహారంలో ఉండే విధంగా తీసుకోవాలి
.

కడుపులో గడబిడ పోయేది ఎలా?


కడుపు మొత్తం గ్యాస్‌తో ఉబ్బి ఉండి, కడుపులో నొప్పిగా ఉంటుంది. విరేచనము వచ్చినట్లుగా ఉంటుంది కాని రాదు.. ఒకవేళ విరేచనం అయితే వరుసగా అవుతూంటాయి. లేదంటే విరేచనం అసలే కాదు. ఇది ఏమి వ్యాధి అబ్బా అని... పరీక్షలన్నీ చేయంచినా అన్ని నార్మల్‌గానే వస్తాయి. కాని వ్యాధి మాత్రం వేధిస్తూనే ఉంటుంది. ఈ నవీన యుగంలో చాలామందిని బాధిస్తున్న ఈ సమస్యనే వైద్య పరిభాషలో ఐబిఎస్ (ఇర్రిటేబుల్ బోవెల్ సిండ్రోమ్) అంటారు.
దీనికి కారణం మారిన జీవనశైలి విధానాలే అని చెప్పవచ్చు. క్షణం తీరిక లేక కాలంతో పరుగులు, వేళకు తీసుకోని ఆహారం, చీటికి మాటికి చిరాకు, కారణం లేకుండానే కోపం, వీటితోపాటు నిత్యం ఎదుర్కొనే రకరకాల మానసిక ఒత్తిళ్ళు తోడుకావడంతో ఐబిఎస్ సమస్య తీవ్రరూపం దాలుస్తున్నది. ఇంతగా వేధిస్తున్న ఈ వ్యాధిని నివారించటానికి హోమియో వైద్యంలో మంచి మందులు ఉన్నాయి. వ్యక్తి శారీరిక, మానసిక లక్షణాలను మరియు అలవాట్లు, జీవన విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వైద్యం చేసిన మంచి ఫలితం ఉంటుంది.
లక్షణాలు
-కడుపు నొప్పి స్వల్పంగాగాని, మెలి పెట్టినట్లుగా గాని ఉంటుంది.
-తేన్పులు ఎక్కువగా ఉండటం
-గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగా ఉండటం
-కడుపులో గడబిడలతో పుల్లటి తేన్పులు రావడం
-మల విసర్జన సరిగా పూర్తిగా కాదు.
-కొన్ని సందర్భాలలో భోజనం చేసిన వెంటనే మల విసర్జనకు వెళ్లాలనిపించటం.
-నీరసంగా ఉండటం, ఏకాగ్రత లోపించటం.
-నీళ్ల విరేచనాలు కాని, జిగట విరోచనాలు గాని కనిపిస్తాయి.
-తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం, వాంతులు కావడం.
-జీవన విధానం సక్రమంగా జరగక ఆందోళన, మానసిక ఒత్తిడి పెరుగును.
జాగ్రత్తలు
-్ఫస్ట్ఫుడ్స్, ఆయిల్‌ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు, మానివేయాలి. ఆల్కహాలు మానివేయాలి
-నిలువ ఉంచిన పచ్చళ్లు తినడం మానాలి. వేళకు ఆహారం తీసుకోవాలి.
-నీరు సరిపడినంతగా తాగాలి. టీ, కాలు మానివేయాలి.
-మానసిక ఒత్తిడిని నివారించడానికి యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి.
మందులు
లైకోపోడియం
వీరు మలబద్ధకంతో బాధపడుతుంటారు. మలవిసర్జన సాఫీగా జరుగక ముక్కలు ముక్కలుగా వస్తుంటుంది. వీరు కొంచెం తినగానే పొట్ట ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. వీరికి బాధలన్ని సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల మధ్యలో ఎక్కువగా ఉంటాయి. మానసిక స్థాయిలో వీరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు.
వీరికి లోపల భయం ఉన్నా పైకి మాత్రం భయం లేనట్లుగా వ్యవహరిస్తారు. వీరికి అహంభావం ఎక్కువగా ఉంటుంది. వీరు సమాజంలో లీడర్‌లాగా ఉండాలనుకుంటారు. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకారి.
నైట్రోమోర్: వీరికి మలం పెంటికలలాగా అవుతుంటుంది. వీరు తల నొప్పితో బాధపడుతుంటారు. వీరికి ఉప్పు చాలా ఇష్టం. వీరికి బాధలన్నీ ఉదయం 10 గంటల నుండి 11 గంటల మధ్యలో ఎక్కువగా ఉంటాయి. వీరు ఓదార్పును ఇష్టపడరు. అలాగే వీరు దుఃఖభారంతో కుంగిపోయి ఉంటారు. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
నక్స్‌వామికా: విరేచనం ఒకేసారి కాకుండా మళ్లీ మళ్లీ వస్తూ ఉంటుంది. పొట్టలో గ్యాస్‌తో సతమతమవుతుంటారు. మసాలాలు, ఫాస్ట్ఫుడ్స్, కాఫీలు ఎక్కువగా సేవించడం, శారీరక శ్రమ తక్కువగా ఉండి, మానసిక శ్రమ ఎక్కువ, ఎప్పుడు పని గురించే ఆలోచిస్తూ ఉన్నవారికి ఈ మందు ఆలోచించదగినది. మానసిక స్థాయిలో వీరికి కోపం ఎక్కువ. శబ్దాలు, వెలుతురు భరించలేరు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
యాలోస్: వీరికి పొట్టలో గ్యాస్ ఎక్కువగా ఉండి, విరేచనం ఆపుకోలేనంత వేగంగా వస్తుంది. వీరు బాత్‌రూంకి వెళ్ళేంత లోపలనే మల విసర్జన జరిగిపోతుంది. వీరికి మల విసర్జన గ్యాస్‌తోపాటుగా నీళ్లు నీళ్లుగా అవుతుంది. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకారి.
అర్జెంటం నైట్రికం: పొట్టలో నొప్పి ఉండి తేన్పులు ఎక్కువగా ఉంటాయి. తిన్న తరువాత పొట్టలో నొప్పి ప్రారంభమవుతుంది. వీరు మానసిక స్థాయిలో ఆందోళన చెందుతుంటారు. ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినా ఎవరైనా వస్తున్నారని తెలిసినా, ఏదైనా పని తలపెట్టినా గందరగోళంలో పడిపోతారు.
ఎనాకార్డియం: వీరికి పొట్టలో నొప్పి ఏదైనా తిన్న తరువాత తాత్కాలికంగా తగ్గుతుంది. మళ్లీ నొప్పి రెండు గంటల తరువాత మొదలవడం గమనించదగిన లక్షణం. వీరు మానసిక స్థాయిలో మతిమరుపు ఎక్కువగా ఉండి దుర్భాషలాడే స్వభావంతో ఉంటారు. ఇటువంటి వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
ఆర్సినికం ఆల్బం: ఈ మందు జీర్ణాశయ వ్యాధులకు తప్పక ఆలోచించదగినది. కడుపులో గడబిడలతో తేన్పులు రావడంతోపాటు వాంతికి వచ్చినట్లుగా అనిపించడం, నీళ్ల విరోచనాలు, జిగట విరోచనాలు, తరచుగా దాహం, ఒళ్లునొప్పులు, మానసిక స్థాయిలో ఆందోళన, భయం వంటి లక్షణాలున్నవారికి ఈ మందు వాడుకోదగినది.
ఫాస్ఫరస్: పొట్టలో అల్సర్ ఉండి వీరికి రక్తం కూడా పడుతుంటుంది. విపరీతమైన నొప్పి ఉంటుంది. చల్లటి పదార్థాలు, ఐస్‌క్రీములు తింటే నొప్పి ఉపశమిస్తుంది. వీరు మానసిక స్థాయిలో భయస్థులు. ఉరుములు మెరుపులు అంటే భయపడతారు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ప్రయోజనకారి.
ఈ మందులే కాకుండా గ్రాఫైటిస్ ఇపికాక్, బ్రయోనియా, సల్ఫర్, కార్బొవెజ్, చైనా వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడితే కడుపులో గడబిడల నుండి విముక్తి పొందవచ్చు
.

B tech - 4 years


how to get good marks in toefl


Friday 19 September 2014

Arogyam --- Anjeera


telugu tips


Dont eat more...



పింపుల్స్ పీడ వదలాలంటే..

సాధారణంగా యుక్తవయస్సు వచ్చిన యువతీ యువకుల్లో కొవ్వు పదార్థం చేరిన చిన్న చిన్న మొటిమలు ముఖంపై ఎక్కువగానూ, ఛాతీ, వీపులపై తక్కువగానూ రావడం జరుగుతుంది.
ఇలా యుక్త వయస్సులో మొటిమలు రావడం సహజమే అయినప్పటికీ, మొటిమలు ఏర్పడగానే తాము అందవిహీనులమవుతామని వారు భావిస్తారు.
అంతేకాకుండా, మార్కెట్‌లో లభించే రకరకాల క్రీములను, లోషన్‌లను రాసుకోవడం, మొటిమలను గిల్లడం మొదలైనవి చేయడంవల్ల మొటిమలు తగ్గకపోగా ఇన్‌ఫెక్షన్‌కు గురై చీము కారడం మచ్చలు ఏర్పడటం, గుంటలు పడటం జరుగుతుంది.
మొటిమలు 12 సంవత్సరాల వయస్సు నుంచి 24 సంవత్సరాల వయస్సు వరకూ వస్తుంటాయి. కాని కొందరిలో హార్మోన్ల అసమతుల్యతవల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడివల్ల స్ర్తిలలో బహిష్టులు సక్రమంగా లేకపోవడంవల్ల, కొన్ని రకాల మందుల దుష్ప్రభావాలవల్ల వయస్సుతో నిమిత్తం లేకుండా ఇవి వస్తుంటాయి.
నివారణకు జాగ్రత్తలు
-మొదటగా మొటిమలను గిల్లడం, గిచ్చడం చేయకూడదు.
-గోరువెచ్చని నీటితో రోజుకు 4 నుండి 6 సార్లు శుభ్రపరచుకోవాలి.
-డాక్టర్ సలహా లేకుండా రకరకాల క్రీములను, లోషన్‌లను వాడకూడదు.
-సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
-్ఫస్ట్ఫుడ్స్, ఆయిల్‌ఫుడ్స్, స్వీట్స్, నిలువున్న ఆహార పదార్థాలు తినకూడదు.
-ప్రకృతి సిద్ధమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలను, ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి.
-మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.
-ప్రతిరోజూ విధిగా కొంత సమయం యోగా, వ్యాయామం చేయడంవల్ల అధిక ప్రయోజనం పొందవచ్చు.
మందులు
మొటిమలకు హోమియోలో మంచి మందులు ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన మందులను ఈ క్రింద పొందుపర్చడం జరిగింది.
కాలిబ్రోమేటం: మొటిమలకు ఇది ముఖ్యమైన మందు. టీనేజ్‌లో వచ్చే అన్ని రకాల పింపుల్స్‌ను ఈ మందు తగ్గిస్తుంది. మొటిమలు ముఖంపై, ఛాతిపై వచ్చి చీము ఉండటం, దురదగా అనిపించడం ఈ మందులులో గమనించదగిన లక్షణం.
బెర్బెరిస్ ఆక్విఫోలియం: ఈ మందును మదర్ టించర్ రూపంలో దూదితో తీసుకుని మొటిమలపై పూతగా రాయాలి. అలాగే పోటెన్సీ రూపంలో లోనికి తీసుకోవటంవల్ల గరకుగా ఉన్న చర్మం నునుపుగా మారుతుంది. పింపుల్స్ త్వరగా తగ్గుతాయి.
ఆర్సినికం బ్రోమేటం: ఈ మందు కూడా యుక్తవయస్సు వచ్చే పింపుల్స్‌కు బాగా పనిచేస్తుంది. పింపుల్స్ ఎక్కువగా ముక్కుపై రావడం, ఎక్కువగా స్ప్రింగ్ సీజన్‌లో వస్తాయి. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
కార్బోవెజ్: ఆరంభ దశలో వచ్చే పింపుల్స్‌కు ఈ మందు బాగా పనిచేస్తుంది.
ఎఖినీషియా: పింపుల్స్ ఇన్‌ఫెక్షన్‌కు గురై బాధిస్తున్నపుడు ఈ మందు మాత్రు ద్రావణాన్ని దూదితో తీసుకుని పైపూతగా రాయడంవల్ల ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది. ఈ మందు ఆంటిసెప్టిక్‌గా పనిచేసి ఇన్‌ఫెక్షన్ త్వరగా తగ్గిస్తుంది.
సైలీషియా కాల్కేరియా ఫ్లోర్: మొటిమలవల్ల ఏర్పడిన మచ్చలను ఈ మందులు తొలగిస్తాయి. ఇన్‌ఫెక్షన్ కూడా నివారిస్తాయి.
ఈ మందులే కాకుండా రస్‌టాక్స్, తూజా, బెల్లడోనా, లైకోపోడియం తదితర మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి మందులను వాడిన పింపుల్స్ బాధనుండి విముక్తి పొందవచ్చు.

సూక్ష్మక్రిములే పెను సవాల్!

    TAGS:
కీటక జనిత వ్యాధులైన మలేరియా, చికున్‌గున్యా, జపానిస్ ఎన్‌సెఫలైటీస్ (మెదడువాపు), డెంగీ, ఫైలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు మనిషికి దోమల ద్వారా వ్యాపించి ఏటా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలను హరిస్తున్నాయి. మలేరియా లక్షణాలతో బాధపడే లక్షలాది మంది ప్రజలు దోమ అంటే విపరీతంగా భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ వ్యాధి దోమల్లో ఎనాఫిలస్ అనే దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ప్లాస్మోడియం జాతికి చెందిన రెండు క్రిముల వల్ల ఈ రోగం వచ్చే అవకాశం ఉంది. ఇందులో ‘వైవాక్స్’ మలేరియా తక్కువ ప్రాణాంతకమైతే ఫాల్సోఫెరం మలేరియా తీవ్రంగా బాధించడంతో పాటు ఒక్కోసారి ప్రాణాలను కూడా హరిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో ఫాల్సోఫెరం మలేరియా, మైదాన, పట్టణ ప్రాంతాల్లో వైవాక్స్ మలేరియా అధికంగా ప్రబలుతుంది. చిన్న పిల్లలకు, గర్భిణీలకు ప్రాణాంతకంగా చెప్పవచ్చు. ఆనాఫిలస్ రకం దోమ కుట్టడం ద్వారా వ్యాధికారక ‘ప్లాస్మోడియం’ పరాన్నజీవి ద్వారా ఒకరినుండి ఒకరికి వ్యాపిస్తుంది. దోమకాటు లేనిదే మలేరియా రాదు. వర్షాకాలంలో కలుషిత పరిసరాలు, వాతావరణంతో ఈ వ్యాధి ప్రబలుతుంది.
మెదడువాపు వ్యాధి...
ఈ వ్యాధి మెదడు, నాడీ వ్యవస్థలను దెబ్బతీస్తుంది. రోగికి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులతో అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. శ్వాసపీల్చడం కష్టమై మెడ బిగుసుకుపోతుంది. జెయి దోమల ద్వారా జంతువులకు సంభవించే ఈ వ్యాధి పక్షులు, జంతువుల ద్వారా మనుషులకు ఆకస్మికంగా ప్రవేశిస్తాయి. ఈ వ్యాధిని కలిగించే వైరస్ జపనీస్, బిఆర్బోవైరస్, ఇవి క్యూలెక్స్ జాతికి చెందిన విష్ణువాయి, ట్రైటనోరింకస్ వంటి దోమల ద్వారా వ్యాపిస్తాయి. ఈ వైరస్ ట్రాన్‌మిషన్ సైకిల్(వ్యాది వ్యాప్తి చక్రం) పందులు, గుర్రాలు, కొంగలు, పాంగ్ హెరాన్స్, కోళ్లు, పావురాళ్లు, బాతులు తదితర పక్షులు జెయి వైరస్‌కు స్థావరాలుగా ఉంటాయి. జెయి వైరస్ కలిగి ఉండే దోమల్ని వెక్టార్ దోమ, క్యూలెక్స్ దోమలు పంటపొలాలు, వరిపొలాలు, గుంతలు, నీటి మడుగులు, నీటి ఊట ప్రాంతాలు వీటి స్థావరాలు, పశువులు, పిట్టలు జెయి వైరస్ ప్రయాణం చేసే స్వాభావానికి వలయం. వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా ఈ వ్యాధి ఉంటుంది. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు ఈ వ్యాధి ప్రబలుతుందని వైద్యులు చెబుతున్నారు. పక్షులు, పశువుల నుండి వైరస్ ప్రవేశించిన తర్వాత దోమలు కుట్టడం వల్ల 9 నుండి 12 రోజుల తర్వాత మనిషిలో ఈ వైరస్ సంక్రమిస్తుంది. 5 నుండి 15 రోజుల వ్యవధిలో మనిషిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. 24గంటల కంటే ఎక్కువ కాలం రోగి తీవ్ర జ్వరం, ఆకస్మాత్తుగా వణుకు, ప్రవర్తనలో మార్పు, జ్ఞానం కోల్పోవడం వంటి జరుగుతాయి. ఈ వ్యాధి మూడు దశల్లో ఉంటుంది. 1. ప్రోడ్రోమల్, 2. ఆక్యూట్ ఎన్‌సెఫలైటీస్, 3. కన్‌వెల్సెంట్ అనే మూడు స్థాయిలు ఉంటాయి. ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స లేదు.
డెంగ్యూ జ్వరం...
ఇది హఠాత్తుగా తీవ్ర జ్వరంతో మొదలై కండ్లు కదిలించలేని పరిస్థితి, ఎముకలు, కండరాల్లో నొప్పి, శరీరంపై పొక్కులు, వాంతులు, వికారం, రక్తంలో కూడిన మలవిసర్జన వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఇది ‘ఎడిస్’ దోమల ద్వారా వ్యాపించే వ్యాధి. చిన్నగా, నల్లగా ఉండే ఈ దోమలు తెల్లని మచ్చలు కలిగి ఉంటాయి. వీటిని టైగర్ దోమలు అని కూడా అంటారు. ఇవి పగలు, రాత్రి కూడా కుడతాయి. ఈ వ్యాధి వైరస్ వలన కలుగుతున్నందున పూర్తి స్థాయి చికిత్స లేదు. ఈ వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు అంటున్నారు. దీనిని నయం చేయడం కన్నా నివారణే మిన్నని వైద్యులు సూచిస్తున్నారు.
చికున్‌గున్యా వ్యాధి...
ఈ వ్యాధి ఆల్ఫా వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. ఇది కూడా ఎడిస్ అనే టైగర్ దోమల ద్వారా వ్యాపిస్తాయి. డెంగ్యూ వ్యాధి లక్షణాలు, రోగ నిర్థారణ వంటివి కూడా చికున్‌గున్యాకు వర్తిస్తాయి. ఈ వ్యాధికి కూడా పూర్తిస్థాయి చికిత్స లేదు. ఇది రోగిని తీవ్రంగా బాధించే వ్యాధి తప్ప ప్రాణాంతకం కాదు.
ఫైలేరియా వ్యాధి...
ఈ వ్యాధి దోమల ద్వారా వ్యాపించే ‘మైకో ఫైలేరియా’ సూక్ష్మ క్రిమి ద్వారా వ్యాపిస్తుంది. క్యూ లెక్స్ దోమలు ఈ వ్యాధిని వ్యాప్తిస్తాయి. ఈ వ్యాధి సోకిన వ్యక్తిలో ఫైలేరియా పరాన్నజీవి సూక్ష్మదశలో ఉపాతి రక్త వ్యవస్థలో మైక్రో ఫైలేరియాలను ఉత్పత్తి చేస్తుంది. సదరు వ్యక్తుల రక్తాన్ని పీల్చిన దోమల్లో మైక్రో ఫైలేరియా ఉంటుంది. గ్రామగ్రామాల్లో ప్రతి ఒక్కరు భారీ మొత్తంలో మాత్రలు పంపిణీ ద్వారా వాడితే సూక్ష్మ ఫైలేరియా నిర్మూలనతో పాటు రోగం వ్యాప్తి కాకుండా నిరోధించబడుతుంది. *

హెపటైటిస్‌కు చోటు.. కాలేయానికి చేటు

హెపటైటిస్ లాంటి వ్యాధులవల్ల లివర్ దెబ్బతినే అవకాశం ఉంది. ఒక్కో ప్రాంతాన్ని బట్టి లివర్ ఫెయిల్యూర్‌కి కారణాలు మారుతుంటాయి. విష పదార్థాలు, కొన్ని రకాలమందులు, ఆల్కహాల్, ఫాటీ లివర్ లాంటి ఎన్నో కారణాలు లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీసి దాని పనిని అది పూర్తిగా నిర్వర్తించలేని స్థితికి తీసుకొస్తాయి. మన దేశంలో 23 నుంచి 56.5 శాతం వరకు హెపటైటిస్ వ్యాధుల కారణంగా లివర్ దెబ్బతినే సమస్య ఎదురవుతుంది. హెపటైటిస్ ఎ, బిలు కూడా మన దేశంలో ఎక్కువ కావడంవల్ల లివర్ వ్యాధులకు ఇది మరో ప్రధాన కారణం. మందులవల్ల లివర్ దెబ్బతినేవారి శాతం 4.6. మూత్రపిండాలు దెబ్బతింటే కొన్నాళ్లపాటు డయాలసిస్ చేసి ప్రాణాన్ని కాపాడవచ్చు. ఊపిరితిత్తులు దెబ్బతింటే వెంటిలేటర్స్‌మీద ఉంచవచ్చు. కాని లివర్ దెబ్బతింటే అలాంటి ప్రాణాలు కాపాడే పద్ధతులు ఏవీ లేవు. లివర్ పూర్తిగా దెబ్బతిన్నవారికి మార్పిడి ఒక్కటే మార్గం. లివర్ ఫెయిల్యూర్‌తో మరణించేవారు మన దేశంలో చాలా ఎక్కువ. అలాంటివారికి సంబంధించిన సరైన గణాంకాలు మన దేశంలో లేవు. పాశ్చత్య దేశాల్లో ఒక మిలియన్ జనాభాలో సంవత్సరానికి ఎనిమిది నుంచి పది వరకు మాత్రమే లివర్ వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు. యుకెలో ఏటా 50 నుంచి 60 వరకు లివర్ మార్పిడులు జరుగుతున్నాయి. మన దగ్గర దాదాపుగా ప్రతి సంవత్సరం 7 నుంచి 12వేల మంది లివర్ జబ్బులతో బాధపడుతున్నారు. వారిలో 1200 నుంచి 2000 మంది వరకు లివర్ మార్పిడి జరగకపోవడంవల్ల మరణిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే దేశవ్యాప్తంగా ప్రతిరోజూ నలుగురైదుగురు లివర్ మార్పిడి జరుగక మరణిస్తున్నారు.
మన శరీరంలో చనిపోయేవరకూ పెరిగే అవయవం లివర్ ఒక్కటే. మూడో వంతు లివర్ ఉంటే చాలు. రెండు నెలల్లో మామూలు పరిమాణానికి పెరిగిపోతుంది. లివర్ మార్పిడిలో డోనర్‌కి వ్యాధిగ్రస్తుడు రక్తసంబంధికుడై ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో బ్రెయిన్ డెడ్ అయినవాళ్లనుంచి స్వీకరించే అవయవదానాన్ని కెడావరిక్ డొనేషన్ అంటారు. అవయవదానికి ఇరువర్గాలు ఒప్పుకోవడం ప్రధానం.
ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ ఎక్కువగా 20-40 సంవత్సరాల మధ్యవయస్సు వాళ్ళల్లో వస్తుంది. అంతకుముందు రోజువరకు ఆరోగ్యంగా ఉన్నవాళ్లలో కూడా హఠాత్తుగా ఈ ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ కన్పిస్తోంది. వీరికి లివర్ మార్పిడి జరుగకపోతే మరణించే అవకాశం 80 శాతం. సకాలంలో లివర్ మార్పిడి చేయడంతో ఈ 80 శాతం మందిని రక్షించవచ్చు.
లివర్ దెబ్బతిన్నప్పటికీ రోగ నిర్థారణ కాకముందే కొంతమందికి మరణం సంభవిస్తుంది. లివర్ దెబ్బతింటుందన్న లక్షణాల్ని గుర్తించలేకపోతున్నారు. కొంతమందిలో మాత్రమే ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ ఉన్నా సకాలంలో గుర్తిస్తే మందులతోనూ నయమవుతుంది. లివర్ మార్పిడి అనేది రోగిని బ్రతికించడం అనేది చివరి మార్గంగా ఎంచుకుంటారు. రోగ నిర్థారణలో ఆలస్యమైనా, సకాలంలో సరైన వైద్యం అందక తీవ్ర స్థాయిలో బాధపడుతున్నవారికి మార్పిడి కూడా కష్టసాధ్యమే. అందువల్ల శరీరంలో 500 పనులకుపైగా చేసే లివర్ ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకుంటూ ఉండాలి. రిస్క్ ఫ్యాక్టర్‌లని గమనించి జాగ్రత్తగా ఉండడం మంచిది. అనుమానం రాగానే సరైన వైద్యుణ్ణి కలవడం అవసరం. ఈ విషయాలపట్ల ప్రజలలో అవగాహన పెరగాలి. లివర్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.

stages of growth of baby during pregnency

NewsListandDetails
పిండం పెరుగుదలని మూడు దశలుగా గమనించవచ్చు. 1. ఓవ్యు లేటరీ లేదా జెర్మినల్‌ పీరియడ్‌-ఓవ్యు లేషన్‌ జరిగిన రెండు వారాల వరకు ఈ దశ ఉంటుంది.
2. ఎండ్రియోనిక్‌ పీరియడ్‌-3వవారం నుంచి 7వవారం వరకు ఉంటుంది. 3. ఫీటల్‌ పీరియడ్‌-8వ వారం నుండి డెలీవరీ అయ్యే వరకు ఫీటల్‌ పీరియడ్‌ ఉంటుంది.
ఇన్నర్‌సెల్‌మాస్‌ నుంచే పిండం తయారవుతుంది. ఇన్నర్‌ సెల్‌మాస్‌ మూడు పొరలుగా రూపొందుతుంది. పై పొర ఎక్టోడెర్మ్‌ నుంచి నాడీమండలం, కన్ను, దంతాలు, చర్మం, నోరు, ముక్కు, వెంట్రుకలు, లాలాజలం గ్రంధులు, పురీషనాళం చివరి భాగం ఏర్పడుతుంది.
రెండో పొర ఎండోడెర్మ్‌ నుంచి జీర్ణమండలం, శ్వాసకోశాలు రూపొందుతాయి. పాంక్రియాస్‌, లివర్‌, లంగ్స్‌, థైరాయిడ్‌, యురెత్రా, మూత్రాశయం, ఉమ్మనీటి సంచి ఏర్పడతాయి.
మూడవపొర మీసోడెర్మ్‌ నుంచి ఎముకలు, గుండె, రక్తనాళాలు, రక్తం, మూత్రనాళికలు, కండరాలు, జననేంద్రియాలు, పెరికార్డియం, పెరిటోనియం ఏర్పడి ఒక శరీర ఆకృతి ఏర్పడుతుంది. 13-15 రోజుల్లో ఉమ్మనీటి సంచి పెద్దదవుతుంది.
20వరోజు పిండానికి గర్భకోశంలో తాడులా ఏర్పడే బొడ్డుతాడు థాతువు ద్వారా తల్లి నుంచి పోషకపదార్థాలు సేకరించడం సాధ్యమవుతుంది.
28వరోజుకు పిండదశలో మెదడుగా రూపొందే ఒకే ఒక నాడీకణం 33సార్లు విభజన చెంది 15వందల కోట్ల కణాలు మూడు నెలల్లో తయారవుతాయి. ఆ విధంగా 3నెలలకు మెదడు ఏర్పడుతుంది. మెదడు బరువు శరీరం బరువులో పదోవంతు ఉంటుంది.
32వరోజుకి ముక్కు చెవులు, కళ్లు పెరుగుతాయి. గుండె కొట్టుకోవడం ఆరంభిస్తుంది. శ్వాసావయవాలు, ట్రకియా, లారింక్స్‌ రూపొందుతాయి.
40వ రోజుకి అన్నకోశం నిర్మాణం పూర్తవుతుంది. అస్తిపంజర నిర్మాణం ప్రారంభమవుతుంది. గుండె నిర్మాణం పూర్తవుతుంది.
50 రోజుకి నాడీమండల నిర్మాణం, కండరాల్ని చూడవచ్చు. ఎడ్రినల్‌, థైరాయిడ్‌ గ్రంధుల్ని గుర్తించవచ్చు. ఏడోవారం నుంచి పిండాభివృద్ధి వేగంగా జరుగుతుంది. పన్నెండో వారంలో బాహ్య జననేంద్రియాల్ని గుర్తించవచ్చు. 11.5 సెం.మీ పొడవుండి 14గ్రా. బరువుంటుంది. నెలలు నిండేసరికి 650మి.లీ. యూరిన్‌రోజుకి ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది.
పదహారో వారంలో చర్మం పింక్‌ కలర్‌లో ఉండి సన్నటి నూస వెంట్రుకలేర్పడతాయి. చర్మం మందంగా మారుతుంది. గర్భంలో శిశువు అటుఇటు తిరుగుతూ ఉంటుంది. పిండం పొడవు 19సెం.మీ ఉండి బరువు 100గ్రా ఉంటుంది.
20వ వారంలో అండాశయాలు,బీర్జాలు కన్పిస్తాయి. మూత్రపిండాలలోని భాగాల్ని గుర్తించవచ్చు. మెకోనియంను గుర్తించవచ్చు. చర్మం ముడతలు పడి ఉంటుంది. పిండం 22సెం.మీ పొడవుండి 300గ్రా. బరువుంటుంది.
24వ వారంలో లంగ్స్‌ గట్టిగా ఉన్నవి మెత్తగా తయారవుతాయి. శ్వాసతీసుకోవడం 11వవారంలో కన్పించిన ఇర్రెగ్యులర్‌గా 20వవారం వరకు ఉంటుంది. నిమిసానికి 30-70సార్లు శ్వాస ఆడుతుంది. బిడ్డ పొడవు 32సెం.మీ బరువు 600గ్రా ఉంటుంది.
28వ వారంలో కళ్లు తెరుస్తారు. ఆకారం సన్నగా ఉంటుంది. వినాళ గ్రంధులు 10వవారం రూపొందినా డెవలప్‌ కావడానికి టైమ్‌ పడుతుంది. గుండె, ఊపిరితిత్తుల కన్నా థైమస్‌ గ్రంధి పెద్దదిగా ఉండి దేహ రక్షణకు ఉపయోగపడే లింఫాయిడ్‌ థాతువుల్ని రూపొందిస్తుంది. బిడ్డ పొడవు 36సెం.మీ. బరువు 1 కేజీ ఉంటుంది.
32వ వారంలో చర్మం అడుగున కొవ్వు పొర ఏర్పడుతుంది. శరీర అవయవాలన్నీ రూపొందుతాయి. బిడ్డ 41 సెం.మీ ఉండి 1800గ్రాముల బరువుంటుంది.
38వవారంలో అవయవాలు సంపూర్ణంగా అభివృద్ధి చెంది ఉంటాయి. 46సెం.మీ పొడవు 2500గ్రాము బరువు ఉంటుంది. పిండం శిశువుగా తల్లి గర్భంలో 280 రోజులుంటుంది. 40వవారం వచ్చేసరికి బిడ్డ బరువు 3,200గ్రాములుంటుంది. పొడవు 50సెం.మీ, తల30-30 సెం.మీ ఉండి సంపూర్ణ ఆకృతిని కల్గి ఉంటుంది. ఇది తల్లి ఆరోగ్యం, తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది. ఫలదీకరణం చెందిన గుడ్డు పొడవు శిశువు పుట్టే సమయానికి 5వేల సార్లు పెరుగుతుంది. కాని శిశువు పెద్దది కావడానికి మూడున్నర రెట్లు మాత్రమే పొడవు పెరుగుతుంది.
పిండం దాని రక్తంను అదే అభివృద్ధి పరుచుకుంటుంది. తల్లి రక్తంలో పిండం రక్తం ఎట్టి పరిస్థితులలోను కలవదు. పిండం గర్భంలో ఉన్నంత కాలం కూడా జీర్ణమండలం గాని, శ్వాసమండలం కూడా పనిచేయదు. అందువల్ల తల్లి రక్తం నుండి పోషకపదార్థాలు ప్రాణవాయువు సరఫరా అవుతాయి.
14వరోజు ఎంబ్రియోనిక్‌ పీరియడ్‌లోనే రక్తకణజాలం రూపొందుతుంది. లివర్‌, స్ప్లీన్‌, ఎముక మూలుగ (బోన్‌మారో) రక్తకణాల్ని రూపొందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఫీటల్‌ రక్తంలో 5-6 మిలియన్‌ రక్తం హిమోగ్లోబిన్‌ 110-150% రెటిక్యులాసైట్స్‌-5% ఎరిత్రోబ్లాస్ట్‌-10% ఉంటుంది. ఎర్రరక్తకణాల జీవితకాలం 80రోజులుంటుంది. 5-8వారాల మధ్య హిమోగ్లోబిన్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుంది.
తెల్లరక్తకణాలు 2నెలల తర్వాత ఉత్పత్తి అవుతాయి. తెల్లరక్తకణాల సంఖ్య 15-29 వేలు ఉంటుంది. థైమస్‌, స్ప్లీన్‌ తెల్లరక్తకణాల్ని పెంపొందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. దీనివల్ల 12వవారంలో మాయ ద్వారా మెటర్నల్‌ ఇమ్యూనో గ్లోబ్యులిన్‌ ఉత్పత్తి అయి పిండ రక్షణ చేస్తుంది.
ఫీటల్‌ సర్క్యులేషన్‌లో తాత్కాలికంగా నిర్మితమైన నాల్గు అవయవాలుంటాయి.
1. డక్టస్‌ దీనోసస్‌ (సిర నుండి సిరకు) ఈ రక్తనాళం అంబులైకల్‌ వెయిన్‌ నుండి ప్రాణవాయువుతో కూడిన మంచి రక్తంను ఇన్‌ఫీరియల్‌ వీనాలోనికి తీసుకొనిపోతుంది.
2. ఫోరామిన్‌ ఓవెల్‌: గుండె రెండు కర్ణికల మధ్య టెంపరరీగా ఏర్పడిన రంధ్రం అందువల్ల రక్తం కుడి నుండి ఎడమ కర్ణికకు ఈ రంధ్రం గుండా పోయి అక్కడి నుండి ఎడమ జఠరికకు నెట్టబడి అక్కడి నుండి అయోర్టాలోనికి పంపబడుతుంది.
3. డక్టస్‌ ఆర్టిరీయోసిస్‌ (ధమని నుండి ధమనికి) ఈనాళం రక్తంను పల్మోనరీ ఆర్డరీ నుండి డిసెడింగ్‌ ఆర్చ్‌లోని అయోర్టాలోకి చేర్చబడుతుంది.
4. హైపోగ్యాస్ట్రిక్‌ ఆర్టిరీస్‌: ఇవి రెండు ఇంటర్నల్‌ ఇలియాక్‌ ఆర్టరీస్‌ నుండి శాఖలై ఈ పేరుతో పిలవబడును. అవి బొడ్డు త్రాడులోనికి ప్రవేశించినపుడు అంబులైకల్‌ ఆర్డరీలుగా పిలవబడును. ఇవి చెడురక్తంను మావికి తీసుకొనిపోతుంది. అక్కడ తిరిగి శుభ్రపడి ప్రాణవాయువును స్వీకరిస్తుంది.
మావిలో శుభ్రపడిన రక్తం అంబులైకల్‌ పెయిన్‌ ద్వారా బొడ్డులోనికి ప్రవేశించి కాలేయానికి ప్రవేశించుటకు ముందు ఒక పెద్ద శాఖ విడిపోయి డక్టస్‌ వీనోసస్‌గా పోయి మంచి రక్తంను ఇన్‌ఫీరియర్‌ వీనాకేవాలోనికి చేరుతుంది. అక్కడ చెడురక్తంతో కలిసి ఇన్‌ఫీరియర్‌ వీనాకేవా నుండి కుడికర్ణికలోనికి పోతుంది. అక్కడి నుండి ఫోరామిన్‌ ఓవెల్‌ ద్వారా ఎడమ కర్ణికకు చేరుతుంది. అక్కడి నుండి ఎడమ జఠరికకు చేరి అక్కడి నుండి అయోర్టాలోకి పంపబడుతుంది. ఎక్కువ రక్తం, తల, చేతులు, నాళం గుండా పోతుంది. ఆ రక్తం సుపీరియర్‌ వీనాకేవా ద్వారా కుడి జఠరికలో పోయి అక్కడి నుండి పల్మోనరీ ఆర్డరీలోకి పోతుంది.
శిశువు పుట్టకముందు పల్మోనరీ సర్కులేషన్‌ చాలా తక్కువగా పనిచేస్తుంది. శిశువు శ్వాస తీసుకొనుట మొదలు పెట్టినందువల్ల శిశువు ఏడ్చినప్పుడు ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి. దీనివల్ల డక్టస్‌ ఆర్డిరీయోసన్‌ నుండి ఆర్టరీన్‌లోనికి ప్రవేశించుచున్న రక్తం ఇప్పడు పల్మోనరీ ఆర్డరీస్‌ నుండి ఊపిరితిత్తులలోనికి ప్రవహించు ప్రాణవాయువును గ్రహిస్తుంది.
పిండం ప్రారంభ బరువు శిశువు పుట్టే సమయానికి 3000మిలియన్‌ సార్లు పెరుగుతుంది. 12 వారాలకి 600% పెరిగితే, 20వారాలకి 220%, తర్వాత నెలనెలకు తగ్గుతూ 120%, 90%, 50%, 20% ఉంటుంది. 9వనెలలో 20% అభివృద్ధి ఉంటుంది
నెలలు నిండిన తర్వాత యూట్రస్‌ 500రెట్లు పెరిగి కోడిగ్రుడ్డు ఆకారంలో ఉండి సుమారు కిలో బరువుండవచ్చు.
ఫలదీకరణం చెందిన అండం ఏవిధంగా కణ విభజన ద్వారా పిండంగా రూపొంది, అభివృద్ధి చెంది పెరిగి మానవాకృతిని పొందుతుందో తెలుసుకున్నారు కదా

cancer remedy -- natural medicine

NewsListandDetails
ఇంట్లో క్యాబేజీ కూర అనగానే ముఖం అదోలా పెడుతున్నారా? దాని ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం ఇష్టంగా తినేస్తారు. క్యారెట్‌తో సమానంగా కంటిచూపుని మెరుగుపరిచే గుణాలు ఇందులో ఉన్నాయి. కాకపోతే వేపుడుగా కన్నా ఉడికించి తాలింపు వేసి తింటే మంచిది. రక్తాన్ని శుభ్రపరిచి, కండరాలు, ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది. దీనిలోని పోషకాలు కేన్సర్ల బారిన పడకుండా కాపాడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులూ, రొమ్ము, గర్భాశయ ముఖ ద్వార కేన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. తాజా క్యాబేజీ రసాన్ని తాగడం వల్ల అంతర్గతంగా ఉండే అల్సర్లు తగ్గుతాయి. ఇనుమూ, సల్ఫర్‌లతో పాటూ దీన్లో ఉండే కొన్ని రకాల ఖనిజాలు శరీరంలో వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ ఇదెంతో ఉపయోగపడుతుంది. క్యాబేజీలో ఉండే టార్‌ టారిక్‌ ఆమ్లం కొవ్వుని కరిగించి, బరువు తగ్గేట్లు చేస్తుంది. మలబద్దకం నివారించే పీచుపదార్థం దీన్లో ఎక్కువగా ఉంటుంది. చక్కటి కంటిచూపునకు తోడ్పడే విటమిన్‌ ఎ, ఎముకలకు శక్తినిచ్చే క్యాల్షియంతో పాటూ విటమిన్‌ బి6, ఫాలేట్‌, రైబోఫ్లెవిన్‌ వంటి పోషకాలు క్యాబేజీ నుంచి అందుతాయి.  

remedy for spots on face - lemon


నిమ్మతో మచ్చలు మాయం
NewsListandDetails
నిమ్మరసంలో చర్మ ఛాయను మెరుగుపరిచే బ్లీచింగ్‌ గుణాలు అధికం. అరచెక్క నిమ్మరసానికి కొద్దిగా నీళ్లూ, అరచెంచా తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. రెండు చెంచాల నిమ్మరసానికి చెంచా తేనె, చెంచా బాదం నూనె కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీనిని ముఖానికీ, మెడకీ పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీనివల్ల తేమతో పాటూ ముఖం నిగారింపు సంతరించుకుంటుంది. మృతకణాలు తొలగించడానికి నిమ్మరసం ఎంతో ఉపయోగపడుతుంది. సగానికి కోసిన నిమ్మచెక్కని పంచదారలో అద్ది, దాంతో ముఖాన్ని సున్నితంగా రుద్దుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. బ్లాక్‌హెడ్స్‌ ఎక్కువగా ఉండే ప్రాంతంలో సన్నగా తరిగిన నిమ్మచెక్కతో కానీ, నిమ్మరసంలో ముంచిన దూదితో కానీ రుద్దితే ఫలితం ఉంటుంది. ముఖంపై పేరుకున్న బ్యాక్టీరియా తొలగి యాక్నే వంటి సమస్యలు పోతాయి. ముఖ చర్మమూ మృదువుగా మారుతుంది.